సందీప్‌రెడ్డి స‌హ‌నానికి ప‌రీక్ష‌పెట్టిన ప్ర‌భాస్‌!

టాలీవుడ్ గేమ్ ఛేంజ‌ర్ `అర్జున్‌రెడ్డి` సినిమాతో ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ద ఇండ‌స్ట్రీ అయ్యారు సందీప్ వంగ‌. ఇదే చిత్రాన్ని బాలీవుడ్‌లోనూ తెర‌కెక్కించిన అక్క‌డ కూడా ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు. దీంతో సందీప్ డైరెక్ష‌న్‌లో న‌టించ‌డానికి ర‌ణ‌బీర్ క‌పూర్‌, ర‌ణ్‌వీర్‌సింగ్ ఆస‌క్తిని చూపించారు. అయితే సోష‌ల్ మీడియా వేదిక‌గా సందీప్ చేసిన వ్యాఖ్య‌లు, వాటి కార‌ణంగా నెటిజ‌న్స్ విప‌రీతంగా ట్రోల్ చేయ‌డం, చివ‌రికి హీరోయిన్స్‌ తాప్సీ, స‌మంత‌, సింగ‌ర్ చిన్మయి రియాక్ట్ కావ‌డంతో సందీప్‌పై బాలీవుడ్‌లో నెగెటివ్ ఒపినియ‌న్ మొద‌లైంది.

దీని కార‌ణంగా సందీప్‌తో సినిమాలు చేయాల‌నుకున్నర‌ణ‌బీర్ క‌పూర్‌, ర‌ణ్‌వీర్‌సింగ్ వెన‌క‌డుగు వేయ‌డం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికితోడు సందీప్ వంగ‌తో నెక్స్ట్ సినిమా చేయాల‌నుకున్న బాలీవుడ్ సంస్థ మైత్రీతో క‌లిసి తెలుగు సినిమా నిర్మించ‌డానికి భారీ ఒప్పందం కుదుర్చుకుంది. మైత్రీ వారు ప్ర‌భాస్‌తో సినిమాకు ప్లాన్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సందీప్ వంగ‌నే దర్శ‌కుడు. `డెవిల్‌` పేరుతో తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లోనూ పాన్ ఇండియా స్థాయి చిత్రంగా నిర్మించాల‌న్న‌ది మైత్రీ వారి ఆలోచ‌న‌. ఇందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

అయితే ప్ర‌భాస్ ప్ర‌స్తుతం `జాన్‌` చిత్రంలో న‌టిస్తున్నారు. ఇది పూర్తయి రిలీజ్‌కావ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఈ సినిమా త‌రువాత కొంత విరామం తీసుకున్నాకే సందీప్ వంగ చిత్రానికి డేట్స్ కేటాయిస్తాడ‌ట‌. ఇదంతా జ‌ర‌గాలంటే ఏడు నుంచి ఎనిమిది నెల‌లు ప‌ట్ట‌డం ఖాయం. అంత స‌మ‌యం ఆగాలంటే సందీప్ కు ప‌రీక్షా కాల‌మే అంటున్నారు.