షాకిస్తున్న ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖర్చు

‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖర్చు  ఎంతంటే

ప్రభాస్ ‘సాహో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసింమదే. ఈ వేడుక కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వేడుకకు హాజరవుతున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో సాహో యూనిట్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ ఈవెంట్ కోసం ఎంత ఖర్చుని నిర్మాత పెడుతున్నారనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

అందుతున్న సమాచారం మేరకు ఈ ఈవెంట్ నిమిత్తం అక్షరాలా రెండున్నర కోట్లు ఖర్చు పెడుతున్నారు. ట్రైలర్ లో చూపిన విధంగా స్టేజ్ ని ఎక్సెపెన్సివ్ బైక్స్, కార్లు వంటి వాటితో నింపుతారట. ఈవెంట్ అయ్యాక కూడా వాటి డిస్ ప్లేని కొంతకాలం పాటు అభిమానుల కోసం ఉంచుతారని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటించింది. చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించింది. ఈ కార్యక్రమాన్ని టీవీ9 ప్రత్యక్షంగా ప్రసారం చేస్తోంది.