శ‌ర్వానంద్‌ ప్లాన్‌కు క‌రోనా ఎఫెక్ట్‌!

శ‌ర్వానంద్ కి బ్యాడ్ టైమ్ న‌డుస్తోంది. ఏ సినిమా చేసినా క‌లిసి రావ‌డం లేదు. ప‌డి ప‌డి లేచే మ‌న‌సు, ర‌ణ రంగం, రీసెంట్‌గా `జాను`… ఇలా వ‌రుస‌గా మూడు ఫ్లాప్ల్‌లు ఎదుర్కొన్నాడు. అన్నింటికంటే శ‌ర్వాని బాగా డిస‌ప్పాయింట్‌కి గురిచేసిన చిత్రం `జాను`. ఈ సినిమాపైభారీ అంచ‌నాలు పెట్టుకున్నాడు. షూటింగ్ స‌మ‌యంలో రిస్క్ చేసి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు కూడా. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగి శ‌ర్వా షోల్డ‌ర్‌కి ప్ర‌మాదం జ‌రిగింది. తాత్కాలికంగా అపోలో వైద్యులు ఆప‌రేష‌న్ చేశారు.

ఆ తరువాత `జాను` షూటింగ్‌ని య‌దావిధిగా పూర్తి చేశాడు. గాయం మ‌ళ్లీ తిర‌గ‌బెట్ట‌డంతో ఆప‌రేష‌న్ కోసం అమెరికా వెళ్లాడు. ఆప‌రేష‌న్ స‌క్సెస్‌. తిర‌గి వ‌చ్చాక 14 ప్ల‌స్ రీల్స్ నిర్మిస్తున్న `శ్రీ‌కారం` షూటింగ్‌లో పాల్గొన‌వ‌చ్చ‌ని ప్లాన్ చేసుకున్న‌డు. తిరుప‌తితో పాటు హైద‌రాబాద్‌లో షెడ్యూల్ పూర్తి చేయాల‌నుకున్నాడు. క‌ట్ చేస్తే క‌రోనా ప్ర‌పంచ వ్యాప్తంగా విళ‌యతాండ‌వం చేస్తోంది. దీంతో శ‌ర్వా ప్లాన్ కాస్తా తారుమారైపోయింది. ఈ నెలాఖ‌రు వ‌రకు తిరుప‌తి షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు కానీ క‌రోనా కార‌ణంగా వాయిదా వేయాల్సి వ‌చ్చింది. దీంతో శ‌ర్వా ప్లాన్ క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా అప‌సెట్ అయిపోయింది.