శర్వానంద్ కొత్త సినిమా ‘శ్రీకారం’ ప్రారంభం

శర్వానంద్ కి మొన్ననే భుజానికి దెబ్బ తగిలి సర్జరీ కూడా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వైద్యులు రెండు మూడు నెలలు విశ్రాంతి చెబితే మనోడు అంతకంటా ముందే కేవలం రోజుల్లోనే కోలుకుని తన సినిమాల చిత్రీకరణకి సిద్ధం అయ్యాడు. అంతకంటే ముందు మరో కొత్త సినిమా నిన్న లాంఛనంగా ప్రారంభం అయింది.
మొదటి షాట్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో జరిగింది. ఈ సినిమాతో కిషోర్ రెడ్డి అనే కొత్త దర్శకుడు పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్ర మాట రచయిత కాగా మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగష్టు నుండి మొదలు అవుతుంది.