విజయభేరి బ్యానర్లో ధనుష్-గౌతమ్ వాసుదేవ్ మీనన్ ‘తూటా’

తమిళ హీరో ధనుష్, దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తొలిసారి పనిచేసిన చిత్రం ‘ఎనై నోకి పాయుమ్ తోట’. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో ‘తూటా’ పేరుతో అనువదిస్తున్నారు. మేఘ ఆకాష్ ఈ చిత్రంలో ధనుష్ కి జోడీగా నటించింది. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఇందులో అతిథి పాత్రలో నటిస్తున్నారు.
ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దర్భుక శివ సంగీతం అందిస్తున్నారు. విజయభేరి వారి బ్యానర్ పై జి తాత రెడ్డి, జి సత్యనారాయణ రెడ్డి ఈ చిత్రం తెలుగు హక్కులను కొనుగోలు చేశారు.