లీక్: `సాహో` క‌థ‌.. క్లైమాక్స్ ట్విస్ట్!

ప్రభాస్ `సాహో` క‌థ‌ ఇదేనా

ప్ర‌భాస్‌, శ్రద్ధ కపూర్ జంట‌గా‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించిన భారీ యాక్షన్ థిల్ల‌ర్ చిత్రం `సాహో`. దాదాపు 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించారు. బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, చంకీ పాండే, త‌దిత‌రులు ప్రధాన పాత్రలలో పోషిస్తున్నారు.

భారీ అంచ‌నాలు రిలీజ్ అవుతున్న ఈ చిత్రం రేపు( ఆగ‌ష్టు 30న) ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. విడుద‌ల‌కు ఇంకొద్ది గంటలు మాత్ర‌మే ఉన్న ఈ టైమ్‌లో సాహో స్టోరీ లీక్ అయింది. ఇప్పుడు ఇదే సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రంలో ప్ర‌భాస్ ఓ పోలీస్ అధికారి. అతని తండ్రి ఒక జెట్ ప్యాక్ సృష్టించిన శాస్త్రవేత్త. అయితే సినిమా అంతా రెండు వేల కోట్ల రాబరీ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. అదే విధంగా ఈ రెండు వేల కోట్లు దొంగ‌లించేది ప్ర‌భాసే. ట్విస్ట్ ఏంటంటే ఈ రాబ‌రీ కేసును ఇన్వెస్టికేష‌న్ చేసేది కూడా ప్ర‌భాసే.

మ‌రి ప్ర‌భాస్ ఈ రాబ‌రీ ఎందుకు చేశార‌న్న విష‌యం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో తెలుస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ వెన‌క ఎవ‌రు ఊహించని విధంగా బలమైన కథ ఉంటుంద‌ట‌. ఇదే క‌థ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో విసృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ క‌థ ఎంత వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌కు రీజ్ అవుతుందో మ‌రి కొన్ని గంట‌ల వ‌ర‌కు వేచి చూడాలి.