లాక్‌డౌన్ టైమ్ భ‌లే క‌లిసొచ్చిందే!

`మ‌హాన‌టి` సినిమాతో స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు నాగ్ అశ్విన్‌. అత‌ని ఏజ్‌కి సినిమా తీసిన తీరుకి ఏమైనా సంబంధం వుందా? అని సినిమా చూసిన వారంతా అవాక్క‌య్యేలా చేశాడు. న‌ట‌నే తెలియ‌ద‌న్న కీర్తిసురేష్‌కి జాలీయ స్థాయిలో ఉత్త‌మ న‌టి పుర‌స్కారాన్ని అందించాడు. ఇంత‌టి అద్భుత చిత్రాన్ని తెర‌కెక్కించిన త‌రువాత నాగ్ అశ్విన్ ఏ సినిమా చేస్తాడు?.. ఆ సినిమా ఎవ‌రితో వుంటుంది? అనే చ‌ర్చ జ‌రిగింది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ప్ర‌భాస్‌తో సినిమా అంటూ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించాడు.

అశ్వ‌నీద‌త్ వైజ‌యంతీ మూవీస్ 50వ వ‌సంతంలోకి అడుగుపెడుతున్న నేప‌థ్యంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని తెర‌పైకి త‌సుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారు. సోషియో ఫాంట‌సీ క‌థ నేప‌థ్యంలో ఈ సినిమా వుండే అవ‌కాశం వుంద‌ని నాగ్ అశ్విన్ మాట‌ల ద్వారా స్ప‌ష్ట‌మైంది. కేవ‌లం లైన్ చెప్పి మాత్ర‌మే ప్ర‌భాస్‌ని ప‌డేసిన నాగ్ అశ్విన్ ఆ త‌రువాత క‌థ‌ని పూర్తి చేసి వినిపించాల‌నుకున్నాడు.

అత‌నికి లాక్‌డౌన్ స‌మ‌యం చాలా ఉప‌యోగ‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఈ స‌మ‌యంలో ఇంటి ప‌ట్టునే వుండ‌టంతో చాలా స‌మ‌యం ల‌భించింది. దీన్ని స‌ద్వినియోగం చేసుకుని ప‌క్కా స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాడ‌ని తెలిసింది. స్క్రిప్ట్‌ని లాక్ చేసిన నాగ్ అశ్విన్ లాక్‌డౌన్ త‌రువాత ప్ర‌భాస్‌కు పూర్తి స్క్రిప్ట్‌ని న‌రేట్ చేయ‌బోతున్నాడ‌ట‌. వ‌చ్చే ఏడాది చివ‌ర‌లో రిలీజ్ చేయాల‌న ప్లాన్ చేసిన ఈ చిత్రం పాన్ ఇండియా అని అంతా అంటుంటే దాన్ని ప్ర‌భాస్ ఎప్పుడో దాటిపోయాడు ఇది ప‌సాన్ వ‌ర‌ల్డ్ అని అశ్విన్ చెప్ప‌డంతో ఈ సినిమా రేంజ్‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తినెల‌కొంది.