రౌడీ హీరో ఎక్క‌డ‌ … సంద‌డి లేదే!

ఎప్పుడు ఎక్క‌డ ఎలాంటి సంఘ‌ట‌న జ‌రిగినా ఈ మ‌ధ్య ముందే స్పందిస్తున్నాడు రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇటీవ‌ల సైనికుల స‌హాయ‌నిధి కోసం.. అలాగే కేర‌ళ వ‌ర‌ద‌ల సంద‌ర్భంగా స్పీడుగా స్పందించి ఆక‌ట్టుకున్నాడు. అయితే ప్ర‌పంచం మొత్తం క‌రోనా వైర‌స్ భ‌యంతో వ‌ణికిపోతున్న వేళ రౌడీ మీరో స్పంద‌నే లేదు. క‌నీసం ఓ ట్వీట్ కూడా వేయ‌డం లేదు.

వ‌రుస ఫ్లాపుల కార‌ణంగా విజ‌య్ సైలెంట్ అయ్యాడా? లేక పూరిజ‌గ‌న్నాథ్‌తో చేస్తున్న‌ `ఫైట‌ర్‌` చిత్రీక‌ర‌ణలో బిజీగా వుండ‌టం వ‌ల్ల ఇంత‌టి సీరియ‌స్ ఇష్యూని ప‌ట్టించుకోలేదా? అని అంతా అనుకుంటున్నారు. ఇదిలా వుంటే అంతా షూటింగ్‌ల‌ని ఆపేయ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ `ఫైట‌ర్‌` షూటింగ్ కూడా ఆపేశారు. దీంతో కావాల్సినంత ఖాలీ టైమ్ దొర‌క‌డంతో ఈ రౌడీ హీరో త‌మ్ముడితో క‌లిసి తాపీగా చెస్ అడుతూ కాల‌క్షేపం చేస్తున్నాడు.

వ‌ర‌ల్డ్ మొత్తం కరోనా ధిటికి కుదేలైపోతుంటే విజ‌య్ దేవ‌ర‌కొండ మాత్రం సోష‌ల్ మీడియాలో క‌రోనా వైర‌స్‌పై ఎలాంటి సందేశాలు ఇవ్వడం లేదు. మొద‌ట్లో తెలంగాణ ప్ర‌భుత్వం కోసం ఓ ప్ర‌క‌ట‌న‌లో పాల్గొని చేతులు దులిపేసుకున్నాడు. ఆ త‌రువాత కరోనా వైర‌స్‌పై ఎలాంటి ట్వీట్‌లు చేయ‌లేదు.