రౌడీ కోసం 15 మందిని దించేశారుగా!

ఈ రోజుల్లో ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్‌కి ర‌ప్పించాలంటే ఏదో కొత్త‌గ ట్రై చేయాలి. అలా చేస్తేనే ప్రేక్షకుల్లో ఆస‌క్తి నెల‌కొంటోంది. దీంతో మ‌న హీరోలు పాత్ర‌ల కోసం ప్ర‌యోగాలు చేయ‌డానికి వెనుకాడ‌టం లేదు. తాజాగా రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా త‌న రౌడీ అభిమానుల కోసం శ్ర‌మించ‌బోతున్నారు. విజ‌జ‌య్ దేవ‌ర‌కొండ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న తాజి చిత్రం `ఫైట‌ర్‌`. ఇస్మార్ట్ శంక‌ర్‌` హిట్‌తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చిన పూరి జ‌గ‌న్నాథ్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.

చార్మి, క‌ర‌ణ్‌జోహార్‌తో క‌లిసి పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెలాఖ‌రు నుంచి ముంబైలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.ఈ సినిమాలో విజ‌య్ ఫైట‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఇందు కోసం ఆయ‌న 15 మంది ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్‌ని నేర్చుకోబోతున్నారు. ఇందు కోసం థాయ్‌లాండ్ వెళుతున్నారు. దీని కోసం క‌ఠ‌న ఆహార నియ‌మాలు పాటిస్తున్నార‌ని చిత్ర బృందం వెల్ల‌డించింది. ముందు నుంచి ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్టే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెర‌పైకి తీసుకురాబోతున్నారు.

జాన్వీక‌పూర్‌ని ఈ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేయాల‌ని పూరి భావిస్తున్నారు కానీ అది అయ్యే ప‌నిలా క‌నిపించ‌డం లేదు. జాన్వి వ‌రుస సినిమాల‌తో బిజీగా వుండ‌టం వ‌ల్ల డేట్స్ ఇచ్చే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. దీంతో మ‌రో క్రేజీ హీరోయిన్ కోసం పూరి సెర్చింగ్ మొద‌లుపెట్టిన‌ట్టు తెలుస్తోంది.