రిటైర్‌మెంట్ త‌రువాత అక్క‌డే నివాసం!

Coronavirus

రాజ‌మౌళి.. ఇప్పుడు ఏ స్టార్ హీరోని క‌దిలించినా ఈ ద‌ర్శ‌‌కుడితో కెరీర్‌లో ఒక్క‌టంటే ఒక్క సినిమా చేయాల‌ని చెబుతున్నాడు. అంత‌గా క్రేజ్‌ని ద‌క్కించుకున్నారు రాజ‌మౌళి. కెరీర్ ప్రారంభః నుంచి అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న జ‌క్క‌న్న ప్ర‌స్తుతం స్టార్ హీరోల‌కు దేశ వ్యాప్తంగా హాట్ ఫేవ‌రేట్ అయ్యారు.

ప్క‌ర‌స్తుతం రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్‌` పేరుతో భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. రామ్‌చ‌ర‌ణ్, ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. కాల్పనిక క‌థ‌తో దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన షూటింగ్‌తో 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. మ‌రో 25 శాతం చిత్ర‌క‌ర‌ణ పూర్త‌యితే గ్రాఫిక్స్ వ‌ర్క్ మొద‌లుపెడ‌తార‌ట‌. క‌రోనా వైర‌స్ కార‌ణంగా యావ‌త్ దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీని కార‌ణంగా షూటింగ్ ఆగిపోయింది.

ఇదిలా వుంటే రిటైర్మెంట్ గురించి రాజ‌మౌళి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌రో ప‌దేళ్ల వ‌ర‌కు రిటైర్మెంట్ లేద‌ని ప్ర‌క‌టించిన జ‌క్క‌న్న ఓ మీడియాతో ప్ర‌త్యేకంగా మాట్లాడి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని పంచుకున్నారు. మ‌రో ప‌దేళ్ల త‌రువాత రిటైర్మెంట్ తీసుకుంటాన‌ని, ఆ త‌రువాత ఓ కుగ్రామంలో సెటిల్ అవుతాన‌ని వెల్డించారు. న‌ల్ల‌గొండ జిల్లాలోని ఈదులూరు గ్రామంలో గ‌త కొంత కాలం క్రితం రాజ‌మౌళి, అత‌ని ఫ్యామిలీ మెంబ‌ర్స్ పొలాలు కొన్నారు. అక్క‌డే రిటైర్మెంట్ త‌రువాత ఫామ్ హౌస్‌ల‌ని నిర్మించుకుని అక్క‌డే వుండిపోతార‌ట‌. పిల్ల‌లు స్థిర‌ప‌డిన త‌రువాత త‌మ కుటుంబాల‌న్నీ అక్క‌డి వెళ్లిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నాయ‌ని రాజ‌మౌళి స్ప‌ష్టం చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.