రాజుగారిగది 3 సెన్సార్ పూర్తి, అక్టోబర్ 18 విడుదల

దర్శకుడు ఓంకార్ తెరకెక్కించిన ‘రాజు గారి గది’ సిరీస్ ఎంత హిట్ అయ్యాయో మనకు తెలిసిందే. ఇప్పుడు దానిలోనే మూడో భాగం మన ముందుకు రాబోతోంది. అశ్విన్ బాబు, అవికా గోర్ జంటగా నటించిన ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికెట్ తెచ్చుకుంది.

ఈ చిత్రం ఓక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఈ నెల 18 న విడుదలకు సిద్ధం అవుతోంది. ష‌బీర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి మంచి స్పందన వచ్చింది.