యువీని బ్యాన్ చేయ‌మంటున్నారా?

యువీని బ్యాన్ చేయ‌మంటున్నారా?

ప్ర‌భాస్ ఫ్యాన్స్ నిన్న మొన్న‌టి వ‌ర‌కు హీరోలాగే కూల్ అనుకున్నారంతా, కానీ తాజాగా వారిలోనూ అస‌హ‌నం మొద‌లైంది. దానికి కార‌ణం యువీ క్రియేష‌న్స్ నిర్మాత‌లే అని తెలిసింది. యువీలో ప్ర‌భాస్ `మిర్చి`. సాహో వంటి భారీ చిత్రాల్ని చేసిన విష‌యం తెలిసిందే. ఈ రెండు చిత్రాల్లో `మిర్చి` సూప‌ర్ హిట్‌గా నిలిస్తే పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కిన `సాహో` మాత్రం ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది.

భారీ స్థాయిలో బిజినెస్ జ‌రిగిన ఈ చిత్రం ఆ రేంజ్‌లో మాత్రం వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిలేక‌పోయింది. ఇదిలా వుంటే ప్ర‌భాస్‌తో యువీ తాజాగా మ‌రో భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. `జాన్‌` టైటిల్ అనుకుంటున్న ఈ చిత్రానికి కృష్ణంరాజు స‌మ‌ర్ప‌కుడిగా వ్యవ‌హ‌రిస్తున్నా పెత్త‌రం, మేజ‌ర్ వాటా మొత్తం యువీదే. ఇటీవ‌లే కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ కోసం జార్జియా వెళ్లొచ్చిన ఈ చిత్ర టీమ్ ప్ర‌స్తుతం లాక్‌డౌన్ న‌డుస్తుడ‌టంతో ఇంటికే ప‌రిమిత‌మైపోయింది.

ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్ కోసం ప్ర‌భాస్ డైహార్డ్ ఫ్యాన్స్ ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. ఉగాదికి ఫ‌స్ట్‌లుక్ వుంటుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ జ‌ర‌గ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు యువీ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేక‌పోవ‌డంతో మండిపోయిన ప్ర‌భాస్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా కొత్త ఉద్య‌మానికి తెర‌లేపారు. ప్ర‌భాస్ సినిమా అప్‌డేట్‌ని ఇవ్వ‌కుండా స‌తాయిస్తున్న యువీని బ్యాన్ చేయాలంటే కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు.
బ్యాన్ యువీ క్రియేష‌న్స్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్ట‌ర్లో హ‌ల్‌చ‌ల్ చేయడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో తేరుకున్న యువీ ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ని శాంతింప‌జేసే ప్ర‌య‌త్నం చేసింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల త‌రువాత వ‌రుస అప్‌డేట్‌ల‌ని అందిస్తామ‌ని, అంత వ‌ర‌కు ఓపిక ప‌ట్ట‌మ‌ని చెప్ప‌డంతో ఫ్యాన్స్‌ కొంత వ‌ర‌కు వెన‌క్కు త‌గ్గిన‌ట్టు తెలిసింది.