యాంక‌ర్ కి డెయిలీ ఆ పాడు అల‌వాటు ఉంద‌ట‌!

 యాంక‌ర్ కి డెయిలీ ఆ పాడు అల‌వాటు ఉంద‌ట‌!

హాట్ యాంక‌ర్ శ్రీముఖి `బిగ్ బాస్ సీజ‌న్ -3`లో సంద‌డి చేసిన సంగ‌తి తెల‌సిందే. ఆ త‌ర్వాత పాపులారిటీ పెరిగింది. సీజ‌న్ -3లో  ఫైన‌ల్ కు చేరుకుని అంద‌ర్నీ ఆశ్చ‌ర్య ప‌రిచింది. ఓటింగ్ వివ‌రంతో ఫాలోవ‌ర్స్ ఎంత మంది అన్న‌ది తేలింది. ఓ యాంక‌ర్ గా శ్రీముఖి కి ఊహిచినం దానికంటే ఎక్కువ‌గానే పాపులారిటీ ఉంద‌ని అర్థ‌మైంది. దీంతో ప్ర‌స్తుతం వ‌రుస‌ టీవీషోలతో బిజీ అయిపోయింది. రెమ్యున‌రేష‌న్ కూడా పెంచేసింద‌ట‌. అటు సినిమా అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి. యాంక‌ర‌మ్మ‌లో హాట్ కంటెంట్ ని ఎలివేట్ చేసే పాత్రల్ని ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు క్రియేట్ చేస్తున్నార‌ట‌.

తాజాగా శ్రీ‌ముఖి త‌న‌కు ఉన్న ఓ విచిత్ర‌మైన అల‌వాటు గురించి చెప్పింది. అదేంటో తెలిస్తే జ‌నం షాక్ కి గుర‌వ్వాల్సిందే. స్కూల్ డేస్ లో మ‌ట్టి ఉండ‌లు.. బ‌ల‌పం పుల్ల‌లు తినేసేద‌ట‌. స్కూల్ కి వెళ్తూ నోట్లో పెట్టుకుని తినేదిట‌.  రుచి బాగుంటున్నాయ‌ని రోజూ అదే ప‌నిచేసిదిట‌. దీంతో ఇంట్లో వాళ్లు ఇచ్చిన బ‌ల‌పం రోజు ఏం చేస్తున్నావ‌ని చేతివాటం చూపించేవారుట‌. అయినా  ఆ దెబ్బ‌లు ముందు బ‌లపం టేస్ట్ మిన్న అని దెబ్బ‌ల‌కి ఒళ్లు అప్ప‌గించేసేద‌ట‌. త‌ర్వాత ఓ సారి బ‌ల‌పం లేక‌పోతే గోడుకున్న  తెల్ల  సున్నం గోళ్ల‌తో గోక్కుని తిన్నదట‌. బ‌లపం లేక‌పోయిన‌ప్పుడ‌ల్లా గొడ‌ల‌పై ప‌డేదాన్ని అని ఓ ఇంట‌ర్వూలో స్వ‌యంగా శ్రీముఖి తెలిపింది.

మ‌రి  ఫైన‌ల్ గా బ‌ల‌పం రుచి ఎక్కువా?  తెల్ల సున్నం రుచి ఎక్కువా? అంటే .. ఛీ అంటూ మూతి బిగించింది. మ‌రి ప్ర‌స్తుతం ఆ అల‌వాటు ఉందా? అంటే లేద‌ని చెప్పింది. అలాగే చిన్న‌ప్ప‌డు  ముగ్గురు అబ్బాయిలు  త‌రుచూ త‌న‌ వెంట ప‌డేవారుట‌. అందులో అశివ్ అనే కుర్రాడు బాగా చ‌దివేవాడుట‌. స్కూల్ కి బొట్టు పెట్టుకుని వ‌చ్చేవాడు వాడు… బాగా చ‌దువుతున్నాడ‌ని అత‌డిని ఇష్ట‌ప‌డిందిట‌. కానీ ఇప్పుడా అబ్బాయి ట‌చ్ లో ఉన్నాడా..  లేడా? అంటే మాత్రం సెలైంట్ అయిపోయింది.