బ‌న్నీ జాతీయ మీడియాని కూడా వ‌ద‌ల‌డం లేదు!

బ‌న్నీపై లోలోన మ‌రిగిపోతున్నార‌ట‌!

ఈ మ‌ధ్య కాలంలో మీడియాని బ‌న్నీ వాడినంత‌గా ఏ హీరో వాడ‌లేదు. త‌ను న‌టించిన తాజా చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఈ సంక్రాంతి బ‌రిలో నిలిచి విజేత‌గా మారిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో ఎన్ని చేయాలో అన్ని చేశాడు అల్లు అర్జున్‌. మునుపెన్న‌డూ లేనంత‌గా పేరున్న మీడియా హౌజ్‌ల‌కు వ‌రుస ఇంట‌ర్వ్యూలు ఇచ్చిన బ‌న్నీ తెలుగు మీడియాని, యూట్యూబ్ ఛాన‌ల్స్‌ని ఓ రేంజ్‌లో వాడేశాడు.

దేశ వ్యాప్తంగా త‌న పేరు ఏం చేస్తే వినిపిస్తుందో అంత‌దాకా వెళ్లి త‌న పేరు వినిపించేలా చేశాడు. `బాహుబ‌లి` గురించి. ప్ర‌భాస్ గురించి మాట్లాడితే జాతీయ మీడియా క‌వ‌ర్ చేస్తుంద‌ని గ్ర‌హించే ఇండ‌స్ట్రీ హిట్ మీట్‌లో `బాహుబ‌లి` గురించి, ప్ర‌భాస్ గురించి ప‌దే ప‌దే ప్ర‌ధానంగా ప్ర‌స్తావించి త‌న‌కు రావాల్సిన మైలేజీని ద‌క్కించుకున్నారు. తాజాగా జాతీయ మీడియాపై కూడా ఫోక‌స్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. జాతీయ మీడియాలో ఎన్టీటీవీకి మంచిపేరుంది. ఆ ఛాన‌ల్‌లో ప్ర‌ముఖంగా వినిపించే రోహిత్ ఖిల్నానీ తాజాగా అల్లు అర్జున్‌తో ప్ర‌త్యేకంగా ఇంట‌రాక్ట్ అయ్యారు.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే సోష‌ల్ మీడియా ఇన్‌స్టా గ్రామ్ ద్వారా వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్‌తో దిగిన ఫొటోని షేర్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. తెలుగు సూప‌ర్‌స్టార్ అల్లు అర్జున్‌తో ఇంట‌రాక్ట్ అయ్యాన‌ని, త్వ‌ర‌లో అది ఎన్టీటీవీలో ప్ర‌సారం కానుందని వెల్ల‌డించారు. ఈ విష‌యం తెలిసిన వాళ్లంతా అమ్మ బ‌న్నీ జాతీయ మీడియాను కూడా వ‌ద‌ల‌డం లేదే అని అవాక్క‌వుతున్నార‌ట‌.