బిగ్ అప్డేట్ : ఈ డేట్ న ప్రభాస్ ని కలవనున్న కేంద్ర మంత్రి..మరో కారణం కూడా ఉందా?

ఇటీవల తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఎలాంటి తీరని నష్టం వాటిల్లిందో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా ప్రముఖ హీరో, రాజకీయ నాయకుడు మరియు నిర్మాత రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో కన్ను మూయడం అందరిని ఎంతగానో బాధించింది.

మరి వారి కుటుంబం నుంచి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో స్టార్డం తెచ్చుకున్న ప్రభాస్ ని తన కుటుంబాన్ని టాలీవుడ్ తెలుగు రాజకీయ ప్రముఖులు ఎంతోమంది వెళ్లి ధైర్యం చెప్పారు. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రభాస్ కోసం ఏకంగా కేంద్ర మంత్రి అమిత్ షా కదిలి వస్తున్నట్టుగా సినీ వర్గాల్లో సహా రాజకీయ శ్రేణుల్లో విస్తృతంగా చర్చ నడుస్తుంది.

గతంలోలా హీరోలను పిలిపించుకొని కాకుండా స్వయంగా ప్రభాస్ ఇంటికే వెళ్లి షా తనని కలిసి వారి కుటుంబంతో మాట్లాడనున్నట్టుగా ఇపుడు అంటున్నారు. ఇక ఇంతకీ అమిత్ షా ఎప్పుడు ప్రభాస్ ని కలవనున్నారు అంటే ఈ సెప్టెంబర్ 16నే కలవనున్నారట. అంటే రేపే ఇక్కడికి వచ్చి పరామర్శించనున్నారని సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి.

దీనితో ఈ మీటింగ్ అంశం కూడా సినీ వర్గాల్లో ఆసక్తిగా మారగా మరో కారణం కూడా దీనిపై ఉందని కొందరు అంటున్నారు. ఎలాగో టాలీవుడ్ హీరోలకి దగ్గరవ్వాలని ఈ పార్టీ చూస్తున్నట్టు అర్ధం అవుతుంది. మరి ఈ సమయాన్ని కూడా వారు తమకి అనుకూలంగా మార్చుకునే స్థాయి రాజకీయాలు చేస్తారా అంటూ మరికొందరు అంటున్నారు. మొత్తానికి అయితే ఈ మీటింగ్ విజువల్స్ రేపు చూడాల్సిందే.