బాలయ్య ఏం చేసాడో… సంఘవికు అంత భయం

బాలయ్యతో భయపడ్డానంటున్న హీరోయిన్

బాలకృష్ణ గురించి బయిట రకరకాల రూమర్స్ వినపడుతూంటాయి. ఆయనకు కోపం ఎక్కువని, ఉత్తినే ఎమోషన్ అయ్యిపోతారని, హీరోయిన్స్ తో రూడ్ గా బిహేవ్ చేస్తారని ఇలా. అయితే అందులో నిజా నిజాలు ఎవరికీ తెలియవు. బయిటకీ రావు. ఆయనతో పని చేసేవాళ్లకు మాత్రమే ఆయన ఎంత పద్దతిగా మర్యాదగా ఉంటారో తెలుస్తుంది. ఆ విషయాలు అప్పుడప్పుడూ బయిటకు వస్తూంటాయి. తాజాగా సీనియర్ హీరోయిన్ సంఘవి ఆ విషయాలని ప్రస్తావించింది.

సంఘవి గుర్తు వచ్చిందా… తెలుగు తెరకి ‘తాజ్ మహల్’ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన సంఘవి, ఆ తరువాత చాలా సినిమాల్లో నటించింది. తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలను గురించి ప్రస్తావించింది.

సంఘవి మాట్లాడుతూ..”తెలుగులో నేను చిరంజీవి .. బాలకృష్ణ .. నాగార్జున .. వెంకటేశ్ ల సరసన నటించాను. బాలకృష్ణగారితో నేను ‘సమరసింహా రెడ్డి’.. ‘గొప్పింటి అల్లుడు’ సినిమాలు చేశాను. ‘సమరసింహారెడ్డి’ షూటింగు సమయంలో ఆయనను చూస్తేనే భయపడిపోయేదానిని. నేను దూర దూరంగా ఉండటం గమనించి ఆయన కారణం అడిగారు.

‘మీకు కోపం ఎక్కువని విన్నాను సార్ .. అందుకని’ అన్నాను నేను. తనకి కోపమే రాదని చెబుతూ ఆయన నా భయాన్ని పోగొట్టారు. మరుసటి రోజు నుంచి భయపడకుండా ఆయన కాంబినేషన్లోని సీన్స్ ను చేశాను” అని చెప్పుకొచ్చింది.