బండ్ల గణేష్ గొడవలోకి వైయస్ జగన్ ని లాగాడు

జగన్ ని తన గొడవలోకి లాక్కొచ్చిన బండ్ల గణేష్

టాలీవుడ్ నిర్మాత‌, న‌టుడు బండ్ల గ‌ణేష్- పీవీపీ మ‌ధ్య కోల్డ్ వార్ పోలీస్ స్టేష‌న్ వ‌ర‌కూ చేరిన సంగతి తెలిసిందే. బండ్ల గ‌ణేష్ తన అనుచ‌రులతో క‌లిసి త‌న‌పై బెందిరింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని పీవీపీ ఆరోపించారు. ఆర్థిక ప‌ర‌మైన వ్య‌వ‌హారాలే ఆ ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌ల‌కు కార‌ణం. ఎన్టీఆర్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో టెంప‌ర్ చిత్రాన్ని బండ్ల గ‌ణేష్ నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో పీవీపీ కూడా 30 కోట్లు పెట్టుబ‌డి పెట్టారు. ఇదే ఇద్ద‌రి మ‌ధ్య వివాదానికి కారణమైంది. ఈ విషయం ప్రక్కన పెడితే ఇప్పుడు ఈ విషయంలోకి జగన్ కూడా లాక్కొచ్చాడు గణేష్.

బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు పోస్టింగ్ పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పీవీపీ నుంచి తనను కాపాడాలని కోరారు. గణేష్ పోస్ట్ చేసిన ట్వీట్ లో ..గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ గారికి… సార్ మమ్మల్ని అందరినీ పివిపి బారి నుంచి కాపాడండి..అంటూ ట్వీట్ చేసారు. దీనికి కొనసాగింపుగా.. జన్న రాజ్యం వచ్చిందని ఆనందంతో బతుకుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇలాంటి దుర్మార్గుడిగా చేతినుంచి కాపాడండి సార్ అంటూ వేడుకున్నారు.

ఓడిపోయిన కేసులు కూడా మళ్లీ డబ్బులు కావాలి అని బెదిరించి మాట్లాడితే… ఆంధ్రప్రదేశ్ నా చేతుల్లో ఉంది మీ అందర్నీ చంపేస్తాను అని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. అందరూ ఆంధ్రప్రదేశ్లో అవినీతి లేని పాలన జరుగుతుందని ఆనంద పడుతూ ఉంటే తులసివనంలో గంజాయి మొక్కలు వీరు చేస్తున్న క్రమంలో మీ పార్టీకి నీకు చెడ్డ పేరు వస్తుందని బండ్ల గణేష్ సూచించారు. మీ పేరు చెప్పి చిత్రపరిశ్రమలో అందర్నీ బెదిరిస్తున్నారు దయచేసి కట్టడి చేయండి అంటూ బండ్ల గణేష్ తన ట్వీట్ ద్వారా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను అభ్యర్దించారు.