ఫ‌స్ట్‌నైట్ ప్లేస్ అంటూ శ్రీ‌రెడ్డి షాకింగ్ పోస్ట్!

శ్రీ‌రెడ్డి.. కాస్టింగ్ కౌచ్ వివాదంతో వెలుగులోకి వ‌చ్చిన పేరిది. త‌న‌కు `మా`లో స‌భ్య‌త్వం ఇవ్వ‌లేద‌ని వ‌ర్మ ఇచ్చిన ప్లాన్ ప్ర‌కారం ఇండస్ట్రీలో ర‌చ్చ‌కు తెర‌లేపి సెల‌బ్రిటీ అయిపోయింది. ప‌నిలో ప‌నిగా ముందు అనుకున్న ప్లాన్ ప్ర‌కారం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని టార్గెట్ చేసి మాన‌సికంగా దెబ్బ‌తీయాల‌ని హ‌ద్దులు దాటి ప‌చ్చిగా కామెంట్లు చేసింది శ్రీ‌రెడ్డి. ఇదే వివాదం స‌మ‌యంలో డి. సురేష్‌బాబు చిన్న కొడుకు అభిరామ్‌తో త‌న‌కున్న సంబంధాన్ని ప‌చ్చిగా బ‌య‌ట పెట్టి సంచ‌ల‌నం సృష్టించింది.

రామానాయుడు స్టూడియో ఫ్లోర్‌లో ఇద్ద‌రికి శెభ‌నం జ‌రిగింద‌ని వెల్ల‌డించ‌డంతో అప్ప‌ట్లో పెద్ద ర‌చ్చ జ‌రిగింది. తాజాగా అదే విష‌యాన్నిస‌రిగ్గా రామానాయుడు వ‌ర్ధంతి రోజున‌ మ‌ళ్లీ ఫేస్ బుక్ వేదిక‌గా చెప్ప‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఫిల్మ్ న‌గ‌ర్‌లో వున్న రామానాయుడు స్టూడియోని డి. సురేష్‌బాబు ఓ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీకి అమ్మేశాడ‌ని, త్వ‌ర‌లోనే ఇది ఫ్లాట్‌లుగా మార‌బోతోంద‌ని, త‌న‌కు, అభిరామ్‌కు ఫ‌స్ట్‌నైట్ జ‌రిగిన ప్లేస్ ఇక వుండ‌బోద‌ని శ్రీ‌రెడ్డి పెట్టిన తాజా పోస్ట్ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది.

దీంతో ప్ర‌భుత్వ స్థ‌లాన్ని చ‌డిచ‌ప్పుడు కాకుండా అమ్మేసి సొమ్ముచేసుకోవాల‌నుకున్న సురేష్‌బాబు బండారం బ‌య‌ట‌ప‌డింద‌ని ఇండ‌స్ట్రీ అంతా చెప్పుకుంటున్నారు. మ‌రి దీనిపై తెలంగాణ ప్ర‌భుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.