ప‌్ర‌భాస్ – నాగ్ అశ్విన్ సినిమా మొద‌ల‌య్యేది అప్పుడే!

క‌రోనా వైర‌స్ విక‌టాట్ట‌హాసం చేస్తోంది. ఇండియాలో దీని ప్ర‌భావం త్వ‌ర‌లో సెకండ్ స్టేజ్‌ని దాట‌బోతోంది. ఈ నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించింది. రాష్ట్రాలు కూడా లాక్ డౌన్‌ని సీరియ‌స్‌గా తీసుకుని ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నాయి. ముఖ్యంగా ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా ప్ర‌భావం ఇప్పుడిప్పుడే ప్ర‌మాద స్థాయిని తాకుతుండ‌టంతో అన్నీ బంద్ చేశారు. దీంతో సినిమా థీయేట‌ర్లు, షూటింగ్‌లు, సినిమా రిలీజ్‌లు ఆపేశారు.

తాజాగా క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌భాస్ కొత్త సినిమా వ‌చ్చే ఏడాదికి వెళ్లిపోయింది. ఇటీవ‌ల `జాన్‌` షూటింగ్ కోసం ప్ర‌భాస్‌, చిత్ర బృందం జార్జియా వెళ్లిన విష‌యం తెలిసిందే. అక్క‌డ మేజ‌ర్ షెబ్యూల్ ప్లాన్ చేసిన చిత్ర బృందం క‌రోనా వైర‌స్ కార‌ణంగా షెడ్యూల్‌ని అర్థాంత‌రంగా ముగించుకుని హుటా హుటిన హైద‌రాబాద్ వ‌చ్చేసింది. దీంతో ఇంకొంత భాగం షూటింగ్ పెండింగ్‌లోనే వుండిపోయింది. దీని ప్ర‌భావం ప్ర‌భాస్ – నాగ్ అశ్విన్ ల సినిమాపై ప‌డింద‌ట‌.

నాగ్ అశ్విన్ అక్టోబ‌ర్‌లో ప్ర‌భాస్‌తో చేయ‌బోతున్న సోషియో ఫాంట‌సీ చిత్రాన్నిప్రారంభించాల‌ని. దీన్నొక పాన్ వ‌ర‌ల్డ్ చిత్రంగా తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేశాడు. అయితే `జాన్‌` షెడ్యూల్ వాయిదా ప‌డ‌టంతో ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్‌ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రికి పోస్ట్ పోన్ చేసిన‌ట్టు తెలిసింది.