ప‌వ‌న్ పిల్ల‌ల కోసం ల‌గ్జ‌రీ ఫ్లాట్‌!

దాదాపు రెండేళ్ల విరామం త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డం మొద‌లుపెట్టారు. `పింక్‌` రీమేక్‌తో వ‌రుస చిత్రాల్ని లైన్‌లో పెట్టారు. ఒక్కో సినిమాకి 40 కోట్ల‌కు మించి లాభాల్లో వాటాని తీసుకుంటున్నార‌ట‌ ప‌వ‌న్‌క‌ల్యాణ్. ప్ర‌స్తుతం వ‌రుస‌గా ఐదు సినిమాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేసిన ప‌వ‌న్ ఈ సినిమాల‌తో భారీ మొత్తాన్నే డిమాండ్ చేసిన‌ట్టు తెలిసింది. ప్ర‌తి సినిమాకి పారితోషికం తీసుకోవ‌డం లేద‌ట‌. లాభాల్లో వాటా మాత్ర‌మే అన్న డిమాండ్‌తో వ‌రుస సినిమాల‌కి అడ్రిమెంట్ చేయించుకున్నార‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.

తాజాగా ప‌వ‌న్‌కి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. భార్య రేణూ దేశాయ్‌తో ప‌వన్ విడిపోయి ర‌ష్య‌న్ యువ‌తిని పెళ్లాడిన విషయం తెలిసిందే. రేణూ దేశాయ్ ద్వారా ప‌వ‌న్‌కు ఇద్ద‌రు పిల్ల‌లు అకీరా, ఆద్యా వున్నారు. రేణూ దేశాయ్‌కి భారీ మొత్తాన్ని భ‌ర‌ణంగా ఇచ్చి విడాకులు ఇచ్చేసిన ప‌వ‌న్ పిల్ల‌లు అకీరా, ఆద్యా కోసం 5 కోట్లు విలువ చేసే ల‌గ్జ‌రీ ఫ్లాట్‌ని కొనుగోలు చేసిన‌ట్టు తెలిసింది. ముర‌ళీమోహ‌న్‌కు చెందిన ఔట‌ర్ రింగ్ రోడ్ స‌మీపంలో వున్న జ‌య‌భేరి వెంచ‌ర్‌లో ఈ ఖ‌రీదైన ఫ్లాట్‌ని ప‌వ‌న్ కొనుగోలు చేసిన‌ట్టు తెలిసింది. ఈ ఫ్లాట్ కేవ‌లం అకీరా, ఆద్యాల కోస‌మే ప్ర‌త్యేకంగా ప‌వ‌న్ తీసుకున్న‌ట్టు చెబుతున్నారు.

గ‌త కొంత కాలంగా అకీరాను హీరోగా ఇంట్ర‌డ్యూస్ చేయాల‌ని రేణూ దేశాయ్ ప్లాన్‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యం వ‌చ్చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే అకీరా హైట్ పెద్ద స‌మ‌స్య‌గా మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయని, ప‌క్క‌న ప‌వ‌న్ నించుంటే అకీరా త‌ప్ప ప‌వ‌న్ క‌నిపించ‌డం లేద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.