ప్ర‌భాస్- హృతిక్ మ‌ల్టీస్టార‌ర్ బ‌డ్జెట్‌పై గుస‌గుస‌

prabhas-hrithik roshan multi starrer latest gossip on budget

రెబెల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ గురించిన‌ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. గ‌త కొద్దిరోజులుగా అత‌డు హృతిక్ తో క‌లిసి ఓ భారీ హిస్టారిక‌ల్ మూవీలో న‌టించ‌నున్నాడ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తారనే వార్తలు కూడా వచ్చాయి.

అయితే దీనిపై ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి అధిక‌రిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నే లేదు. తాజా గాసిప్ ఏమిటంటే, ఈ ప్రాజెక్ట్ ను భారీ మల్టీస్టారర్ గా పాన్ ఇండియా కేట‌గిరీలో తెర‌కెక్కించేందుకు దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్ ని కేటాయించ‌నున్నార‌ని లీకు అందుతోంది. ఇది టాలీవుడ్ – బాలీవుడ్ సంస్థ‌ల కాంబినేష‌న్ లో ఉండే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

బాహుబ‌లి ప్రభాస్  బాలీవుడ్ మాకో హీరో హృతిక్ రోషన్ తో సినిమా అంటే బ‌డ్జెట్ విష‌యంలో రాజీకి వ‌చ్చే ప్ర‌స‌క్తే ఉండ‌దు. అందుకే ఈ మూవీని అతిపెద్ద యాక్షన్ థ్రిల్లర్ గా మ‌లిచే వీలుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే కాన్వాసును ఎంపిక చేసుకుని బ‌డ్జెట్ల‌ను వెచ్చించ‌నున్నార‌ట‌. అయితే ఈ సినిమాని నిర్మించే బ్యాన‌ర్లు ఏవి అన్న‌ది ఇప్ప‌టికీ స‌స్పెన్స్ గానే ఉంది.