ప్ర‌భాస్ డైరెక్ట‌ర్‌కి రామ్‌చ‌ర‌ణ్ ఓకే చెప్పేస్తాడా?

రామ్‌చ‌ర‌ణ్

స్టార్ హీరోలంతా ఒక సినిమా అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్ లో వుండ‌గానే మ‌రో చిత్రాన్ని లైన్‌లో పెట్టేస్తున్నారు. రామ్‌చ‌ర‌ణ్ కూడా అదే త‌ర‌హాలో మ‌రో సినిమాకు రెడీ అవుతున్నాడు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ ఆర్ ఆర్‌`లో న‌టిస్తున్న రామ్‌చ‌ర‌ణ్ ఈ సినిమాతో పాటు జ‌క్క‌న్న ఓకే అంటే `ఆచార్య‌`లోనూ న‌టించ‌డానికి ఎదురుచూస్తున్నాడు. అయితే `ఆర్ ఆర్ ఆర్` పూర్తి కాకుండా మ‌రో చిత్రంలో త‌న హీరోలు న‌టించ‌డానికి మాత్రం జ‌క్కన్న అంగీక‌రించ‌డం లేదు.

దీంతో `ఆచార్య‌` యూనిట్ రామ్‌చ‌ర‌ణ్ కోసం ఎదురుచూస్తోంది. ఇదిలా వుంటే రామ్‌చ‌ర‌ణ్ మ‌రో సినిమా కోసం కూడా రెడీ అవుతున్నాడ‌ట‌. అయితే త‌న ముందు రెండు మూడు ఆప్ష‌న్స్ క‌నిపిస్తుండ‌టంతో దేన్ని పిక్ చేసుకోవాలో అర్థం కావ‌డం లేద‌ని చెబుతున్నారు. రామ్‌చ‌ర‌ణ్‌తో సినిమా చేయాల‌ని వంశీ పైడిప‌ల్లి ఎదురుచూస్తున్నాడు. అయితే ఈ మ‌ధ్య‌లోకి యువీ టీమ్ ఎంట‌రై త‌మ బ్యాన‌ర్‌లో సినిమా చేసేందుకు రామ్‌చ‌ర‌ణ్ కోసం ఎదురుచూస్తోంది.

ఈ చిత్రానికి సుజిత్ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌నున్నాడ‌రి తెలిసింది. చ‌రణ్ కోసం ఇప్ప‌టికే ఓ పాన్ ఇండియా స్థాయి స్క్రిప్ట్‌ని రెడీ చేశాడ‌ట‌. చ‌ర‌ణ్‌తో ఒప్పించి సినిమా చేయాల‌ని యువీ సంస్థ వంశీ పైడిప‌ల్లి కంటే స్ట్రాంగ్‌గా ట్రై చేస్తోందట‌. యువీ వెన‌క ప్ర‌భాస్ వుండ‌టంతో రామ్‌చ‌ర‌ణ్ త‌ప్ప‌కుండా ఈ ప్రాజెక్ట్‌నే ఫైన‌ల్ చేస్తాడ‌ని ఇన్ సైడ్ టాక్‌.