ప్ర‌భాస్ టీమ్ అర్థాంత‌రంగా వ‌చ్చేశారా?

ప్ర‌భాస్ తాజా చిత్రం షూటింగ్ కోసం జార్జియా వెళ్లిన విష‌యం తెలిసిందే. అక్క‌డ క‌రోనా వైర‌స్ విళ‌యతాండ‌వం చేస్తోంది. దీంతో ప్ర‌భాస్ సినిమా షూటింగ్ కోసం ఇంత సాహ‌సం అవ‌స‌ర‌మా? అని అంతా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇట‌లీలో ఓ షెడ్యూల్‌ని పూర్తి చేసిన టీమ్ మిగ‌తా మేజ‌ర్ సీన్‌ల‌ని త‌గిన జాగ్గ‌త్త‌లు తీసుకుంటూ పూర్తి చేస్తున్నామని సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. అయితే అనూహ్యంగా చిత్ర బృందం ఇండియా ప‌య‌న‌మైంది.

ప్ర‌భాస్‌తో స‌హా ప్ర‌త్యేక విమానంలో టీమ్ అంతా ఇండియాకు వ‌చ్చేసింది. అయితే క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌భాస్ సినిమా షూటింగ్‌ని పేశార‌ని, ఆ కార‌ణంగానే టీమ్ అర్థాంత‌రంగా షెడ్యూల్‌ని ముగించుకుని తిరుగు ప్ర‌యాణం అయ్యార‌ని ప్ర‌చారం మొద‌లైంది. అయితే ఈ ప్ర‌చారంలో ఎలాంటి వాస్త‌వం లేద‌ని, త‌మ షూటింగ్‌ని ఎవ‌రూ ఆప‌లేద‌ని, షెడ్యూల్ ప్ర‌కార‌మే షూటింగ్‌ని పూర్తి చేశామ‌ని ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌కుమార్ వెల్ల‌డించారు. ఇండియా వచ్చిన ఈ చిత్ర బృందానికి అధికారులు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.