ప్రభాస్ ని డైరక్ట్ గా క‌లిసే ల‌క్కీ ఛాన్స్

సాహో స్టార్ ప్రభాస్ ని కలవాలని ఉందా?

మీరు యంగ్ రెబ‌ల్ స్టార్ కి పెద్ద ఫ్యానా? ప‌్ర‌భాస్ తో కాసేపు కాలక్షేపానికి మీరు ఆసక్తి చూపిస్తున్నారా? అయితే ఈ ఆఫర్ మీకే రావ‌చ్చు. సాహో ప్ర‌చారంలో భాగంగా యూవీ క్రియేష‌న్స్ ఈ అవ‌కాశాన్ని ప్రేక్ష‌కాభిమానుల‌కు క‌ల్పించింది.

అయితే అందుకు ముందు చేయాల్సిన ప‌ని ఒక‌టుంది. సాహో పోస్ట‌ర్ తో పాటు, ఓ సెల్ఫీ తీసుకుని దాన్ని ప్ర‌భాస్ ఇన్ స్టా గ్రామ్ కి ట్యాగ్ చేయటమే. ప్ర‌భాస్ నేరుగా విన‌ర్స్ ని ఎంపిక చేస్తాడు. దానికి సంబంధించి ప్ర‌భాస్ ఓ వీడియో చేసి సోష‌ల్ మీడియాలోకి వ‌దిలాడు.

హాయ్ డార్లింగ్స్ అని సంభోధించి పై విష‌యాన్ని ప్ర‌భాస్ త‌న‌దైన స్టైల్ లో చెప్పాడు. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం. ఎంత‌మందికి ప్ర‌భాస్ ఛాన్స్ క‌ల్పిస్తాడో చూసేద్దాం. ముందు మీరు ట్యాగ్ చేసేయండి. ఇక క సాహో చిత్రం నెల 30 న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సాహో టీమ్ తో స‌హా ప్ర‌భాస్ ప్ర‌చారం ప‌నుల్లో బిజీగా ఉన్నారు. బాహుబ‌లిని మించిన ప్ర‌చారం సాహోకి చేయ‌డం విశేషం.