ప్రభాస్ కు రిలీఫ్…ధాంక్స్ చెప్పాడు

ఫ్యాన్స్ కు ధాంక్స్ చెప్పిన ప్రభాస్‌

ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సాహో’. శ్రద్ధాకపూర్‌ హీరోయిన్. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా పర్వాలేదనిపిస్తోంది. దాంతో ప్రభాస్ కొద్దిగా రిలీఫ్ ఫీలయ్యారు. ఈ సందర్భంగా ప్రభాస్‌ తన ఫ్యాన్స్ కు ధన్యవాదాలు తెలిపారు.

ఇప్పటికే ఈ చిత్రం రూ.350కోట్ల క్లబ్‌లో చేరింది. దీంతో ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందిస్తూ.. ‘నా ప్రియమైన అభిమానులు, ప్రేక్షకులరా.. ‘సాహో’పై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. మీ వల్లే సినిమాకు మంచి పేరు, రెస్పాన్స్ న వచ్చాయి. మీ ప్రేమకు ధాంక్స్’ అని పోస్ట్‌ చేశారు.

యూవీ క్రియేషన్స్‌ పతాకంపై భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ‘సాహో’ తెరకెక్కింది. జిబ్రాన్‌ నేపథ్య సంగీతం, ట్విస్ట్‌లు సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. తొలి రెండు రోజులు మిశ్రమ స్పందనతో సరిపెట్టుకున్న ‘సాహో’ ప్రస్తుతం వసూళ్ల పరంగా పర్వాలేదనినిస్తోంది.

ఈ యాక్షన్ థ్రిల్లర్ కు ప్రేక్షకుల నుండి మొదటి రోజు నుంచి డివైడ్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాకి దక్కిన ప్రీ రిలీజ్ హైప్, బాహుబలి ఎఫెక్ట్ తో ఈ సినిమాకి భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగాయి. అందుకే సినిమా టాక్ ఎలా ఉన్నా సినిమా కలెక్షన్స్‌కు మాత్రం పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. కానీ ఐదో రోజు నుంచి మాత్రం పూర్తిగా కలెక్షన్స్ భారీ డ్రాప్ కనిపించింది. యాభై నుంచి అరవై శాతం మంగళ వారం నుంచి డ్రాప్ కనిపించింది. శెలవలు పూర్తవటంతో ఆ ఎఫెక్ట్ కనిపించింది. అయితే డ్రాప్ ఉంటుందని ఊహించారు కానీ ఈ స్దాయి అని ఎవరూ ఎక్సపెక్ట్ చేయలేకపోయారు.