పాపం శృతి!!!

ఈ సినీ ప్రపంచంలో ఇప్పుడే అందలం ఎక్కడం అప్పుడే కిందకి పడిపోవడం వెంటవెంటనే జరిగిపోతాయి. హిట్ వస్తే ఎంత పారితోషకం ఇచ్చి అయినా సినిమాలో తీసుకుంటారు అదే ప్లాప్ వస్తే ఇక ఎవరూ ముఖం చూడరు. అలాంటి ఈ సినీ ప్రపంచంలో కావాలనే సినిమాలు వదులుకుని ఇప్పుడు కావాలంటే వస్తాయా. ఇదంతా ఎవరి గురించి అంటే హీరోయిన్ శృతి హస్సన్ గురించి.

ఒకప్పుడు ఆమె మహేష్ బాబు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి వారి సరసన నటించి హిట్లు ఇచ్చింది. కోటిన్నర పారితోషకం సుమారు మూడు నాలుగేళ్ల క్రితమే తీసుకుంది. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు రవి తేజతో సినిమా తప్ప చేతిలో మరె సినిమా లేదు.

పైగా ఆమె వెళ్లిన సమయంలో రకుల్, పూజ హెగ్డే వంటి వారు ఆమె స్థానాన్ని భర్తీ చేసేసారు. దాంతో ఆమె ప్రేక్షకులకు గుర్తు కూడా లేదు. ఈ కారణాలు అన్నింటి వల్లా ఆమె మరో భారీ హిట్ ఇచ్చేనంతవరకు ఆమెకు చాలా తక్కువ పారితోషకమే అందుతుంది. తప్పదు మరి అంటున్నారు సినీ పండితులు.