తెలుగు హీరో కోసం మ‌ళ్లీ విల‌న్ అవ‌తారం?

స్టార్ హీరో కోసం క‌న్న‌డ హీరో మ‌ళ్లీ విల‌న్‌గా మార‌బోతున్నాడ‌ని తెలిసింది. క‌న్న‌డ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో విల‌క్ష‌ణ హీరోగా, ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న క‌న్న‌డ హీరో ఉపేంద్ర మరోసారి తెలుగు చిత్రంలో విల‌న్‌గా న‌టించ‌బోతున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. గ‌తంలో బ‌న్నీ న‌టించిన `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` చిత్రంలో ఉపేంద్ర విల‌న్‌గా న‌టించిన విష‌యం తెలిసిందే.

మ‌రోసారి అదే త‌ర‌హా పాత్ర‌లో మ‌రో స్టార్ హీరో చిత్రంలో క‌నిపించ‌బోతున్నార‌ని తెలిసింది. వివ‌రాల్లోకి వెళితే.. `స‌రిలేరు నీకెవ్వరు` చిత్రంతో ఈ సంక్రాంతికి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్న మ‌హేష్ విశ్రాంతి కోసం ఫ్యామిలీతో క‌లిసి యుఎస్ వెళ్లారు. ఇండియా తిరిగి వ‌చ్చిన త‌రుతా వంశీ పైడిప‌ల్లితో సినిమా చేస్తాన‌ని వెల్ల‌డించాడు. అయితే త‌ను చెప్పిన స్టోరీ ఇంప్రెస్ చేయ‌క‌పోవ‌డంతో కొర‌టాల శివ ద్వారా ప‌ర‌శురామ్ చెప్పిన క‌థని ఓకే చేశారు.

మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాయి. ఇప్ప‌టికే స్క్రిప్ట్ లాక్ చేశారు కూడా. త్వ‌ర‌లోనూ షూటింగ్ ప్రారంభించాల‌ని ప్లాన్ చేశారు. జూన్‌లో ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్న ఈ చిత్రంలో ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్‌గా ఉపేంద్ర‌ని చూపించాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే త‌మ ప్ర‌పోజ‌ల్‌ని ఉపేంద్ర‌కు చెప్పార‌ట‌. ఆయ‌న స‌మాధానం కోసం టీమ్ ఎదురుచూస్తున్న‌ట్టు ఇన్ సైడ్ టాక్‌.