తిరుమ‌లలో అల టీమ్ హంగామా!

`అల వైకుంఠ‌పుర‌ములో` అనూహ్య విజ‌యాన్ని సాధించి ఊహించ‌ని విధంగా ఇండ‌స్ట్రీ హిట్ గా నిల‌వ‌డంతో టీమ్ అంతా సంబ‌రాలు చేసుకుంటున్నారు. గ‌త కొన్ని రోజులుగా సెల‌బ్రేష‌న్స్ మోడ్‌లోకి వెళ్లిపోయిన అల టీమ్ తాజాగా తిరుప‌తికి వెళ్లి స్వామివారిని ద‌ర్శించుకుని నిజ‌పాద సేవ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. గురువారం ఉద‌య‌మే తిరుమ‌ల చేరుకున్న అల టీమ్ స్వామివారి సేవ‌లో త‌రిస్తోంది. బ‌న్నీ కుటుంబ స‌మేతంగా భార్య‌, కూతురు అర్హా, త‌న‌యుడు అయాన్‌, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌తో క‌లిసి తిరుమ‌ల‌కు వెళ్లారు.

స్వామివారి ప‌ట్టు వ‌స్త్రాల్లో ద‌ర్శ‌న‌మిస్తున్న వీరి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. సినిమా స‌క్సెస్ అయింద‌ని తెలిసిన ద‌గ్గ‌రి నుంచి వ‌రుస పార్టీల్లో మునిగితేలుతున్నారు అల్లు అర్జున్‌. 18 నెల‌ల విరామం త‌రువాత త‌న‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ `అల వైకుంఠ‌పుర‌ములో` సినిమాతో ల‌భించ‌డంతో అమితానందానికి లోన‌వుతున్న బ‌న్నీ కొంత ఆల‌స్యంగానే స్వామివారిని ద‌ర్శించుకోవ‌డం గ‌మ‌నార్హం. తిరుమ‌ల వెళ్లిన వారిలో నిర్మాత రాధాకృష్ణ‌, సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ కూడా వున్నారు.