టెన్నిస్ టీమ్ లో స్టార్ హీరోయిన్ భారీ పెట్టుబడులు

సాధారణంగా హీరోలే తమ సంపాదనను ఇతరత్రా పెట్టుబడులుగా పెడుతుంటారు. అది కూడా కొన్నేళ్ల పాటు సంపాదించినా డబ్బును ఆచి తూచి పెట్టుబడిగా వ్యాపారంలో పెడుతుంటారు. ఈ మధ్య బాలీవుడ్ సెలబ్రిటీలు ఐపీఎల్ టీంలు కొనుగోలు చేయటం చూసాం.

అలా ఇప్పుడు తెలుగు నాట స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ టెన్నిస్ టీం లో భారీగా పెట్టుబడులు పెట్టి మరి కొన్ని బృందాలలో కొంత వాటా కూడా కొన్నట్టు సమాచారం. ఈమె ఇప్పటికే F45 పేరుతో హైదరాబాద్ మరియు వైజాగ్లలో రెండు శాఖలు కూడా ప్రారంభించింది. ఇక టెన్నిస్ ప్రీమియర్ లీగ్ లను ఆమె ప్రచారం చేయనుందట. ఏది ఏమైనా ఈ పంజాబీ భామ వ్యాపార మెళకువలను త్వరగానే నేర్చుకుంది కదూ.