`జాన్‌` కోసం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌!

`బాహుబ‌లి` త‌రువాత ప్ర‌భాస్ సినిమా రూపురేఖ‌లే మారిపోయాయి. ఏది చేసిన పాన్ ఇండియా లెవెల్లోనే చేయాలి. అలా చేస్తేనే ఆ సినిమాకు గ్రాండీయ‌ర్ లుక్ వ‌స్తుంది. రాధాకృష్ణ‌కుమార్ ఇప్పుడు అదే పాట్లు ప‌డుతున్నాడు. ప్ర‌భాస్‌తో రాధాకృష్ణ‌కుమార్ ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్న విష‌మం తెలిసిందే. ఈ చిత్రం కోసం కొత్త ప్ర‌పంచాన్ని సృష్టించాడ‌ట‌. రాజ‌మౌళి బాహుబ‌లి కోసం మ‌హిష్మ‌తి సామ్రాజ్యాన్ని సృష్టించిన‌ట్టుగా రాధాకృష్ణ‌కుమార్ ఈ చిత్రం కోసం కొత్త ప్ర‌పంచాన్ని ఆవిష్క‌రించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

ఇది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో వ‌స్తుంద‌ట‌. దీని కోసం ప్ర‌భాస్ లుక్‌ని కూడా కొత్త‌గా డిజైన్ చేసిన‌ట్టు తెలిసింది. యూర‌ప్ నేప‌థ్యంలో సాగే ఈ రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ కోసం ఓ భారీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ని ప్లాన్ చేశార‌ని, అది సినిమాకు ప్ర‌ధాన హైలైట్‌గా మార‌నుంద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది. ప్ర‌స్తుతం స‌రికొత్త లుక్‌లో వున్న ప్ర‌భాస్‌పై ఈ కీల‌క ఎపిసోడ్‌ని షూట్ చేస్తున్నార‌ట‌. భారీ స్థాయిలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అయితే గ్రాఫిక్స్ కార‌ణంగా ఆల‌స్యం అయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్‌, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.