క్వారెంటైన్ టైమ్‌ని ప్ర‌భాస్ అలా గ‌డిపేస్తున్నాడ‌ట‌

క్వారెంటైన్ టైమ్‌ని ప్ర‌భాస్ అలా గ‌డిపేస్తున్నాడ‌ట‌

`బాహుబ‌లి` త‌రువాత ప్ర‌భాస్ సినిమా స్థాయి, మార్కెట్ మారిపోయింది. ఏ సినిమా చేసినా పాన్ ఇండియా రేంజ్‌లోనే ఆలోచిస్తున్నాడు. ప్ర‌స్తుతం రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని చేస్తున్నాడు. `జాన్‌` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్ర‌భాస్ పెద‌నాన్న కృష్ణంరాజుకు చెందిన గోపీకృష్ణా మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తోంది. క‌రోనా వైర‌స్ ఇత‌ర దేశాల్లో ప్ర‌బ‌లుతున్న స‌మ‌యంలో రిస్క్ అని హెచ్చ‌రిస్తున్నా జార్జియా వెళ్లి అక్క‌డ కీల‌క స‌న్నివేశాల్ని పూర్తి చేసి ఇండియా తిరిగి వ‌చ్చారు.

ప్ర‌తీకూల ప‌రిస్థితుల్లో జార్జియా వెళ్లి వ‌చ్చిన ప్ర‌భాస్ వ‌చ్చిన ద‌గ్గ‌రి నుంచి ఎవ‌రినీ క‌ల‌వ‌కుండా క్వారెంటైన్‌కే ప‌రిమిత‌మైపోయారు. ఎక్కువ స‌మ‌యం నిద్ర‌కే కేటాయిస్తున్నాడ‌ట‌. ఆ త‌రువాత టైమ్‌ని వీడియో కాల్స్‌కి వినియోగిస్తున్నాడ‌ని చెప్పుకుంటున్నారు. ఆ వీడియో కాల్స్ మాత్రం త‌నకు అత్యంత స‌న్నిహితంగా వుండే అనుష్క‌కి, ఆ త‌రువాత రానాకి మాత్ర‌మే చేస్తూ క‌బుర్లు చెబుతున్నాడ‌ట‌.

ఎవ‌రినీ క‌ల‌వ‌కుండా ఇంట్లోనే టైమ్ స్పెండ్ చేస్తుండ‌టంతో ప్ర‌భాస్‌ తొలి రోజుల్లో బోర్ ఫీల‌య్యాడ‌ట‌. ఆ త‌రువాత నుంచే వీడియో కాల్స్ చేస్తూ అనుష్క, రానాల‌తో కాల‌క్షేపం చేస్తున్నాడ‌ని, మిగ‌తా టైమ్ అంతా నిద్ర‌కే కేటాయిస్తున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.