కోర్టు కెక్కిన ‘వాల్మీకి’వివాదం,ఎవరిది తప్పు?

‘వాల్మీకి’పై హైకోర్టులో పిటిషన్‌

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అంటించిన వాల్మీకి చిత్రం వచ్చే నెల 13న విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదల దగ్గర పడుతుండగా చిత్రంపై వివాదాలు రాజుకుంటున్నాయి. గత కొంతకాలంగా వాల్మీకి సినిమా టైటిల్‌ మార్చాలంటూ మొదలైన వివాదం ముదిరి ఈ రోజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

బోయ వాల్మీకి కులస్థుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా చిత్రాన్ని రూపొందించారని, సినిమా టైటిల్‌ మార్చేలా ఆదేశాలు ఇవ్వాలని బోయ హక్కుల సమితి పిటిషన్‌ దాఖలు చేసింది. అలాగే తమ కులస్థులను కించపరిచేలా సినిమా తీసిన చిత్ర యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

కొన్ని రోజుల క్రితం షూటింగ్ నిమిత్తం అనంతపురం వెళ్తే అక్కడి వాల్మీకి కులస్తులు అడ్డుకున్నారు. దీనితో ఈ చిత్రం టీమ్ కు రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ కొంత టెన్షన్ పెరుగుతోంది. వివాదాన్ని కోర్టు బయిట సెటిల్ చేసుకోకుండా హరీష్ శంకర్ మొండిపట్టు పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే వాల్మికి అనే పేరుకేవలం ఓ కులానికి సంభందించినది అంటే ఎలా అనేది మరి కొందరి వాదన.

ఇక తొలిసారిగా విలన్ కనిపించబోతున్న వరుణ్ తేజ్ లుకే సినిమాకు హైలైట్ గా నిలిచింది. పూజా హెగ్డే, అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు చేస్తున్నారు. 14రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 13న విడుదల కానుంది.