కరోనాతో అన్ని మారాయి, నిర్మాతలు మారండి !

క‌రోనా దెబ్బ‌కు దిగివ‌స్తున్నాయి?

క‌రోనా మ‌హ‌మ్మారితో సినీ ప్ర‌పంచం మెత్తం అత‌లాకుత‌ల‌మవుతున్నా ఏమి చేయలేని పరిస్థితి. లాక్‌డౌన్ తో ఆపేసిన సినిమాల షూటింగ్స్ మళ్లీ మొదలై మళ్ళీ ఆగిపోయాయి. దానికి తోడు అసలు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఇంకా క్లారిటీ లేదు. దాంతో ఏ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో కూడా తెలియకుండా పోయింది. నాలుగు నెలలు ముందే దర్శకనిర్మాతలు పక్కా ప్లానింగ్ తో రిలీజ్ డేట్స్ ను ముందుగానే ప్రకటించి ఆ దిశగా ముందుకు వెళ్తున్న క్రమంలో సడెన్ గా కరోనా వచ్చి సినిమా ఇండస్ట్రీ మొత్తానికి బ్రేక్ వేసి పారేసింది. దాంతో సినిమాలన్ని పోస్ట్ ఫోన్ అవ్వక తప్పలేదు.

కాగా నిశ్శబ్దం, రెడ్, మాస్టర్ (తమిళ డబ్), ‘వి’, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, ఒరేయ్ బుజ్జిగా, ఉప్పెన లాంటి సినిమాలు ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్నా అవి డైరెక్ట్ థియేటర్ రిలీజ్ కోసమే ఎదురుచూస్తున్నాయి. లాక్ డౌన్ పెరిగే కొద్దీ నిర్మాతలకు అదనపు వడ్డీ రూపంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, ఒరేయ్ బుజ్జిగా, ఉప్పెన లాంటి చిన్న సినిమాలు ఓటిటీలో రిలీజ్ అయితే బెటర్ అని ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినా ఓటిటీ ప్లాట్ ఫామ్ పై డైరెక్ట్ రిలీజ్ కి మాత్రం ఆయా సినిమాల మేకర్స్ అంగీకరించకపోవడం శోచనీయం.

అయితే నిశ్శబ్దం మాత్రం ఓటిటీలో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో యంగ్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ పై ఓటిటీ ప్లాట్ ఫాన్స్ లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికైనా నిర్మాతలు మనసు మార్చుకుని, రెడ్, ‘వి’, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, ఒరేయ్ బుజ్జిగా, ఉప్పెన లాంటి సినిమాలు ఓటిటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయితే బెటర్ అనేది కామన్ మెన్ అభిప్రాయం. మరి నిర్మాతలు మనసు మార్చుకుంటారా .. ఏమో చూడాలి.