ఒకే రోజు ఫ్యాన్స్‌కి డ‌బుల్‌ ట్రీట్‌!

మే 20.. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి డ‌బుల్ ట్రీట్‌గా మార‌బోతోంది. ఈ రోజు రెండు చిత్రాల‌కు సంబంధించిన స్పెష‌ల్ న్యూస్ బ‌య‌టికి రాబోతోంది. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌పైకి రాబోతున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ 30వ చిత్రంగా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, ‌ఈ రోజు ఫ్యాన్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై ఎస్‌. రాధాకృష్ణ‌, నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

స‌మ‌కాలీన రాజ‌కీయాంశాల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డానికి త్రివిక్ర‌మ్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఎన్టీఆర్ పుట్టిన రోజున ఈ చిత్ర టైటిల్‌ని ప్ర‌క‌టించాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. `అయిన‌ను పోయి రావ‌లే హ‌స్తిన‌కు` అనే టైటిల్ ఇప్ప‌టికే ప్ర‌చారంలో వుంది. ఇదిలా వుంటే రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్‌` నుంచి కూడా బ‌ర్త్‌డే స్పెష‌ల్ ప్రోమోని విడుద‌ల చేయ‌బోతున్నారు.

అయితే దీనికి సంబంధించి కావాల్సి పుటేజ్ స‌గ‌మే వుంద‌ని, మిగ‌తా స‌గం షూట్ చేయాల్సి వుంద‌ని రాజ‌మౌళి ఇటీవ‌ల ఓ టీవీ లైవ్ షోలో వెల్ల‌డించారు. రామ్‌చ‌ర‌ణ్ ప‌రిచ‌య ప్రోమోకు ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్ అందించిన‌ట్టే.. ఎన్టీఆర్ ప్రోమోకు రామ్‌చ‌ర‌ణ్ వాయిస్ ఓవ‌ర్ అందించ‌బోతున్నాడు. వున్న పుటేజ్‌నే ఎన్టీఆర్ ప్రోమోకు స‌రిపెడ‌తారా? లేక రాజ‌మౌళి ఇంకేదైనా మ్యాజిక్ చేస్తాడా అన్న‌ది వేచి చూడాల్సిందే. ఎన్టీఆర్ బ‌ర్త్‌డే మ‌రో 19 డేస్ వుండ‌టంతో మే 1 నుంచే ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో హంగామా మొద‌లైంది. #NTRBdayFestBegins అనే హ్యాష్ ట్యాగ్‌తో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్య‌దేవ‌ర‌నాగ‌వంశీ ట్వీట్ చేసిన పిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.