ఇంత‌కీ బాహుబ‌లి ఎక్క‌డున్నాడు?

క్వారెంటైన్ టైమ్‌ని ప్ర‌భాస్ అలా గ‌డిపేస్తున్నాడ‌ట‌

ఇంత‌కీ బాహుబ‌లి ఎక్క‌డ?.. ఫిల్మ్ స‌ర్కిల్స్‌లోనూ, సామాన్య అభిమానుల్లోనూ వినిపిస్తున్న మాటిది. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారిలా మాన‌వ వినాశ‌నాన్ని కోరుతూ కోర‌లు చాస్తుంటే ప్ర‌మాదం అని తెలిసి కూడా లైట్ తీసుకోని `జాన్‌` సినిమా షూటింగ్ కోసం ప్ర‌భాస్ జార్జియా వెళ్లిన విష‌యం తెలిసిందే. అక్క‌డ క‌రోనా కేసులు అధికం అవుతున్నా స‌రే మార్కెట్ సెట్‌లో కీల‌క సీన్‌ల‌ని, ఓ ఛేజింగ్ సీన్‌ని పూర్తి చేశారు ప్ర‌భాస్ అండ్ కో.

ఇటీవ‌లే ప్ర‌త్యేక విమానంలో ఇండియా తిరిగి వ‌చ్చారు. వెళ్లుప్పుడు మాస్కుల‌తో క‌నిపించి సంచ‌ల‌నం సృష్టించిన ప్ర‌భాస్ వ‌చ్చే ముందు మాత్రం ఎలాంటి హ‌డావిడిని ప్ర‌ద‌ర్శించ‌లేదు. వ‌చ్చామంటే ద‌ర్శ‌కులు రాధాకృష్ణ‌కుమార్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌లో ఓ ఫొటోని షేర్ చేసి వెల్ల‌డించాడు. శంషాబాద్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌లో ప‌రీక్ష‌లు చేయించుకుని ఇంటికి తిరిగొచ్చిన ప్ర‌భాస్ ఆ రోజు నుంచి మీడియాకు క‌నిపించ‌కుండా పోయారు.

ఇంత‌కీ బాహుబ‌లి ఎక్క‌డ అని అంతా వెతుకుతున్న వేళ త‌ను స‌ల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్లిపోయిన‌ట్టు ఓ వార్త బ‌య‌టికి వ‌చ్చింది. 14 రోజుల పాటు ప్ర‌భాస్ బ‌య‌టికి రాకుండా ఇంట్లోనే గ‌డ‌పాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌.