ఇండ‌స్ట్రీ హిట్‌కి సీక్వెల్ చేస్తార‌ట‌?

అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. మాట‌ల మాంత్రికుడి త్రివిక్ర‌మ్ మ్యూజిక‌ల్ మ్యాజిక్‌గా తెర‌పైకొచ్చిన ఈ సినిమా ఈ సంక్రాంతి బ‌రిలో నిలిచి అనూహ్య విజ‌యాన్ని సొంతం చేసుకుంది. మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో పోటీకి దిగి బ‌రిలో విజేత‌గా నిలిచి ఇండ‌స్ట్రీ హిట్ అనిపించుకుంది. `అల…` ఇండ‌స్ట్రీ హిట్ అనే మైలు రాయిని చేరుకోవ‌డానికి బ‌న్నీ వ‌న్‌మెన్ ఆర్మీగా నిలిచి చివ‌రికి త‌న పంతాన్ని నెగ్గించుకున్నాడు.

ఇంత‌టి ఘ‌న‌విజ‌యాన్ని అందించిన ఈ సినిమాకు సీక్వెల్ తీస్తే ఎలా వుంటుంది? అన్న ఆలోచ‌న మేక‌ర్స్‌కి వ‌చ్చిన‌ట్టు వినిపిస్తోంది. అల్లు అర్జున్‌ కెరీర్‌లో ఒక్క ఇండ‌స్ట్రీ హిట్ లేదు. ఆ లోటుని తీర్చిన ఈ చిత్రానిరి సీక్వెల్ ఎందుకు చేయ‌కూడ‌ద‌న్న‌ది నిర్మాత వాద‌న‌. సినిమా ఎండింగ్‌లోనూ అస‌లు వార‌సుడు త‌న ఇంటికి.. వార‌సుడు కాని సుశాంత్ ముర‌ళీశ‌ర్మ ద‌గ్గ‌రికి వెళ్లే వ‌ర‌కు ఎండ్ కార్డ్ వేసేశాడు త్రివిక్ర‌మ్ అక్క‌డి నుంచి క‌థ‌ని మ‌రో మ‌లుపు తిప్పుకోవ‌చ్చ‌ని ఫ్యామిలీ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్‌ని తీస్తే బాగుంటుంద‌ని నిర్మాత రాధాకృష్ణ, త్రివిక్ర‌మ్ ఆలోచిస్తున్నార‌ట‌. ఈ ఆలోచ‌న హీరో అల్లు అర్జున్ కి కూడా న‌చ్చింద‌ని చెబుతున్నారు.