`ఆహా` కోసం ముగ్గురిని దించేస్తున్నాడు!

అల్లు అర‌వింద్ ప్రారంభించిన `ఆహా`కు అనుకున్న స్థాయిలో ఆద‌ర‌ణ ల‌భించ‌డం లేదు. కంటెంట్ ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది. ఈ ప‌రిణామాల్ని సీరియ‌స్‌గా తీసుకున్న అల్ల అర‌వింద్ వెరైటీ కంటెంట్‌, క్వాలిటీ కంటెంట్‌ని అందించాల‌ని ముగ్గురు క్రేజీ ద‌ర్శ‌కుల్ని రంగంలోకి దింపేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే వారితో ఓ భారీ ఒప్పందం కూడా చేసుకున్న‌ట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

ఆ ముగ్గురు క్రేజీ డైరెక్ట‌ర్‌లు మ‌రెవ‌రో కాదు సుకుమార్‌, వేణు ఊడుగుల‌, సుధీర్ వ‌ర్మ. ఈ ముగ్గురూ త్వ‌ర‌లో `ఆహా` కోసం వెబ్ సిరీస్‌లు చేయ‌బోతున్నార‌ట‌. సినిమాతో పోలిస్తే ఇక్క‌డ రిస్ట్రిక్ష‌న్స్ ఏమీ వుండ‌వు. తాము చెప్పాల‌నుకున్న‌ది. చూపించాల‌నుకున్న‌ది నిర‌భ్య‌త‌రంగా చెప్పొచ్చు. అదే ఈ ద‌ర్శ‌కుల‌ని ఇటు వైపు అడుగులు వేసేలా చేసింద‌ట‌. ఈ ముగ్గురిలో సుకుమార్ ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌తో ఓ భారీ చిత్రాన్నిచేస్తున్నారు. అది పూర్త‌యిన త‌రువాతే ఆయ‌న ఫ్రీ అవుతారు. వేణు ఊడుగుల ప‌రిస్థితి అంతే రానా, సాయిప‌ల్ల‌వితో `విరాట‌ప‌ర్వం` తెర‌కెక్కిస్తున్నారు. సుధీర్ వ‌ర్మ కూడా సైలెంట్‌గా ఓ సినిమా చేస్తున్నారు. ముగ్గురి ప్రాజెక్ట్‌లు పూర్త‌యిన త‌రువాత వెబ్‌ సిరీస్‌ల బాట ప‌డ‌తార‌ట‌.