‘అల.. వైకుంఠపురంలో..’ డిజిటల్ రైట్స్ వాళ్లకే సొంతం

‘అల.. వైకుంఠపురంలో..’ బిజినెస్ స్టార్టైపోయింది

‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘అల.. వైకుంఠపురంలో..’ . ఆదివారం ఈ సినిమా మొదటి పోస్టర్ ని ట్విటర్‌ వేదికగా అల్లు అర్జున్‌ తన అభిమానులతో పంచుకున్నారు. ‘ఫస్ట్‌ పోస్టర్‌ ఆఫ్‌ ఏవీపీఎల్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ ప్రచార చిత్రంలో అల్లు అర్జున్‌ క్లాస్‌, మాస్‌ లుక్‌లో కనిపిస్తూ ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ కు మంచి ఊపు వచ్చింది.

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని సన్ నెక్ట్స్ వారు ఫ్యాన్సీ ఎమౌంట్ కు సొంతం చేసుకున్నారు. అయితే శాటిలైట్ రైట్స్ గురించి క్లారిటీ లేదు. జెమినీ టీవీవారు ఆ రైట్స్ తీసుకునే అవకాసం ఉంది. బన్నీ 19వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. వీరిద్దరూ ఇంతకు ముందు ‘దువ్వాడ జగన్నాథం(డీజే)’లో కలిసి నటించారు.

టబు, జయరాం, నివేదా పేతురాజ్‌, సుశాంత్‌, సునీల్‌ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌.రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రంలోని ఓ సన్నివేశానికి సంబంధించిన వీడియో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2020 సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.