`అల‌..` బాలీవుడ్ రీమేక్‌లో హీరో మారాడా?

అల్లు అర్జున్ న‌టించిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఈ సంక్రాంతి రేసులో విజేత‌గా నిలిచింది. బ‌న్నీ కెరీర్‌లోనే తొలి ఇండ‌స్ట్రీ హిట్ అనిపించుకుంది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్స్‌పై ఎస్‌. రాధాకృష్ణ‌, అల్లు అర‌వింద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లు ర‌విదం్ ప్లాన్ ప్ర‌కారం ఈ చిత్రాన్ని ఇండ‌స్ట్రీ హిట్ అనిపించారు.

ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర‌వింద్ మాత్రం తానే రీమేక్ చేస్తాన‌ని రైట్స్ త‌న ద‌గ్గ‌రే పెట్టుకున్నారంటూ వార్త‌లు షికారు చేశాయి. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్‌. రాధాకృష్ణ ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ‌తో క‌లిసి రీమేక్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే చ‌ర్చ‌లు కూడా జ‌రిగినట్టు తెలుస్తోంది.

ఈ రీమేక్‌లో షాహీద్‌క‌పూర్ న‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే తాజాగా కార్తీక్ ఆర్య‌న్ పేరు వినిపిస్తోంది. అత‌ను అయితేనే ఫ్రెష్‌గా వుంటుంద‌ని హిందీ మేక‌ర్స్ కూడా భావిస్తున్నార‌ట‌. సెకండ్ బిగ్గెస్ట్ ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని హిందీలోనూ ఇదే స్థాయిలో హిట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల్ని నిర్మాత ఎస్‌. రాధాకృష్ణ మీడియాకు వెల్ల‌డించ‌నున్న‌ట్టు తెలిసింది.