అల్లు అర్జున్ ప్లాన్‌కి క‌రోనా దెబ్బ‌!

బ‌న్నీపై లోలోన మ‌రిగిపోతున్నార‌ట‌!

2020… ఈ ఇయ‌ర్ హీరో అల్లు అర్జున్‌కు.. క‌రోనా వైర‌స్‌కు చాలా స్పెష‌ల్ ఇయ‌ర్‌. మాన‌వాళికి మాత్రం కాళ‌రాత్రుల్ని ప‌రిచ‌యం చేస్తున్న ఇయ‌ర్. ఈ ఏడాది అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. ఇదే ఉత్సాహంతో ఓ భారీ ఈవెంట్‌ని ప్లాన్ చేశాడ‌ట‌. బ‌న్నీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ శ‌నివారంతో 17 ఇయ‌ర్స్ పూర్త‌య్యియి. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని అల్లు అర‌వింద్ భారీ ఈవెంట్‌ని ఏర్పాటు చేయాల‌ని ప్లాన్ చేశార‌ట‌.

ఇందు కోసం అల్లు అర్జున్‌తో వ‌ర్క్ చేసి డైరెక్ట‌ర్‌లు, నిర్మాత‌లు, హీరోయిన్‌ల‌ని ఈ ఈవెంట్‌కి ఆహ్వానించిన‌ట్టు తెలిసిది. అయితే అనూహ్యంగా ప్ర‌పంచాన్ని క‌రోనా వైర‌స్ వ‌ణికిస్తండటంతో గ‌త వారం ప్ర‌దాని మోదీ ఇండి మొత్తం లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో అల్లు అర్జున్, అల్లు అర‌వింద్ అనుకున్న ప్లాన్ క‌రోనా కార‌ణంగా ర‌ద్దు చేసుకోవాల్సి వ‌చ్చింద‌ట‌. 17 ఇయ‌ర్స్ సెల‌బ్రేష‌న్స్ క‌రోనా దెబ్బ‌తో ఇంటికే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలోనే అల్లు అర్జున్ హ‌డావిడి కూడా అంతాగా లేక‌పోవ‌డంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫీల‌వుతున్నార‌ట‌.