‘అర్జున్ రెడ్డి’ కాంబినేషన్ లో మ‌రో సినిమా!?

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్  విజయ్ దేవరకొండ క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్క ‘అర్జున్ రెడ్డి’ సినిమాతోనే హీరోగా  తనకంటూ ఓ  ప్రత్యేకమైన గుర్తింపును  తెచ్చుకున్నాడు. అలాగే ఈ చిత్రానికి దర్శకత్వం వహించి సందీప్ వంగ సైతం యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గా ఊపిరి పోసుకున్నాడు.

ఈ  ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి బాలీవుడ్ లో కూడా భారీ బ్లాక్ బస్టర్ అందుకుని హిందీలోనూ  స్టార్ డైరెక్టర్ గా మంచి క్రేజ్ సంపాదించాడు. అయితే  ప్రస్తుతం  సందీప్ వంగ బాలీవుడ్ లో మరో చిత్రం కోసం సిద్ధమవుతున్నట్టు తెలిసింది. మరో భారీ ప్రాజెక్ట్‌ని ప్ర‌క‌టించ‌డానికి రెడీ అవుతున్న టైమ్‌లో..

లాక్‌ డౌన్ కార‌ణంగా సందీప్ ప్లాన్ మొత్తం తారుమారైపోయింది. తలపట్టుకున్న సందీప్ వంగ  ఇక లాభం లేదనుకొని ఈ లాక్‌ డౌన్ లో మరో మూడు క‌థ‌ల్ని సిద్ధం చేసుకున్నాడట. అందులో ఒకటి విజయ్ దేవరకొండ కోసమట. అయితే ఈ సినిమాకు  మరో రెండేళ్లు సమయం పడుతుంది. మొత్తానికి ‘అర్జున్ రెడ్డి’ కాంబినేషన్ లో మ‌రో అయితే  సినిమా రాబోతుంది. అదీ సంగతీ..!