అమెరికా ఎన్నారైల‌కు ‘సాహో’ హ్యాపీ న్యూస్

  ‘సాహో’ ప్రీమియర్ షోల గురించి లేటెస్ట్ న్యూస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన్న చిత్రం ‘సాహో’. అగ‌ష్టు 30న ఈ సినిమాను ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. ప్రి రీలిజ్ బిజినెస్ సైతం అదే స్దాయిలో జరిగింది. ఈ సినిమా కోసం ప్రస్తుతం చిత్రం టీమ్ భారీ ఎత్తున ప్రమోషన్స్‌ ను నిర్వహిస్తోంది. ఈ నేపధ్యంలో అమెరికాలో 29న ప్రీమియ‌ర్ షోలు ఉంటాయా? లేదా? అన్న దానిపై కొద్ది రోజులుగా స‌స్పెన్స్ కొన‌సాగుతోంది.

ఎందుకంటే ప్రీమియర్ షోలు ఉండవంటూ మీడియాలో వార్త కథనాలు గుప్పు మన్నాయి. దాంతో అమెరికా ఎన్నారైలు, అభిమానులు కాస్త డైలామాలో ప‌డ్డ మాట నిజం. అయితే వీళ్లందరికీ ఓ హ్యాపీ న్యూస్. 29న ప్రీమియ‌ర్ షోలు య‌ధాత‌ధంగా ఉంటాయ‌ని క్లారిటీ వ‌చ్చింది. దాదాపు పది కోట్లు దాకా లాభం వస్తుందని అంచనా వేసారు.

అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయ‌ని , వీటికి భారీగా క్రేజ్ నెల‌కొంద‌ని సమాచారం. మరో ప్రక్క సాహో పారిస్ లోని ప్రఖ్యాత గ్రాండ్ రిక్సె లో కూడా స్పెషల్ షో కూడా ఉంది. అయితే ఆ డేట్ మాత్రం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ప్రస్తుతం యూనిట్ ప్రమోషన్ ప‌నుల్లో బిజీగా ఉంది. ఈ రోజు హైద‌రాబాద్ రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుక అభిమానుల స‌మ‌క్షంలో జ‌ర‌గ‌బోతుంది.

ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్‌ దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మందిరా బేడీ, జాకీ ష్రాఫ్‌, చుంకీ పాండే, అరుణ్‌ విజయ్‌లు కీలక పాత్రల్లో నటించారు.