అమీర్‌ఖాన్ – ప్ర‌భాస్.. అయ్యే ప‌నేనా?

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఆమీర్‌ఖాన్‌కున్న క్రేజ్ గురించి అంద‌రికి తెలిసిందే. ఓ సినిమా చేయాలంటే చాలా సెలెక్టీవ్‌గా చేస్తుంటారు ఆమీర్‌. ప్ర‌తీ క్యారెక్టర్ ప‌ర్‌ఫెక్ట్‌గా రావాల‌ని త‌పిస్తుంటారు. అలాంటి మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ , `బాహుబ‌లి`తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ క‌లిసి న‌టిస్తారా? ఒక వేళ అది కుదిరే ప‌నేనా అంటే ఓ యంగ్ డైరెక్ట‌ర్ మాత్రం అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నాడు.

న‌వీన్ పొలిశెట్టి హీరోగా ప‌రిచ‌య‌మైన చిత్రం `ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌`. ఈ చిత్రంతో స్వ‌రూప్ ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చాడు. సీరియ‌స్ పాయింట్ చంట‌బ్బాయి త‌ర‌హా కామెడీని జోడించి తెర‌కెక్కించిన తీరు ఆక‌ట్టుకుంది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ని తెర‌కెక్కించాల‌నే ప్ర‌య‌త్నాల్లో వున్నాడు. లాక్‌డౌన్ త‌రువాత ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌ని మొద‌టుపెట్ట‌బోతున్నాడ‌ట ద‌ర్శ‌కుడు స్వ‌రూప్‌.

ఓ మీడియా ఇంట‌రాక్ష‌న్ అయిన స్వ‌రూప్ త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి.. క్రేజీ ఆలోచ‌న గురించి చెప్పి షాకిచ్చాడు. త‌‌న‌కు బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్‌, ప్ర‌భాస్‌ల‌తో భారీ మ‌ల్టీస్టార‌ర్ చేయాల‌ని వుంద‌ట‌. అవ‌కాశం వ‌స్తే అంతా ఆశ్చ‌ర్య‌‌ప‌డేలా ఎక్స‌ట్రార్డిన‌రీ క‌థ‌తో సినిమా చేస్తాన‌ని చెబుతున్నాడు. స్వ‌రూప్ క్రేజీ ఆలోచ‌న విన్న వారంతా అమీర్‌ఖాన్ – ప్ర‌భాస్.. మ‌ల్టీస్టార‌ర్ అయ్యే ప‌నేనా? అంటున్నారు.