మేడ్చల్‌‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

రామాయంపేట నుంచి హైదరాబాద్ వస్తున్న మితిమిరిన వేగంతో వచ్చి బావర్చీ హోటల్ ముందు డివైడర్ ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు స్పాట్ లోనే మృతి చెందగా మరొకరు.. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. కారులో మెుత్తం 9 మంది ఉన్నారు. వారికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి వెళ్లి గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారు మధ్య ప్రదేశ్ కి చెందిన‌ గోరా సింగ్, బిబ్బు సింగ్ లుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు