ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరుగుతున్నది. అయితే ఆదివారం నాడు విఐపిల కోసం భక్తులను గంటల తరబడి ఎదురుచూసేలా చేశారు. నెత్తిన బోనాలు పెట్టుకుని మహిళా భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి తమను ఆపడంతో జోగిని శ్యామల సీరియస్ అయ్యారు. తెలంగాణ సర్కారుకు శాపనార్థాలు పెట్టారు. ఆమె కంట తడి పెట్టారు. 26 ఏళ్లుగా బోనం నిర్వహిస్తున్నా ఎప్పుడూ ఇలా జరగలేదని బాధపడ్డారు. కానీ ప్రభుత్వం గొప్పగా ఏర్పాట్లు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప ఆడవాళ్లకు గౌరవం లేదన్నారు. ఇంకా ఆమె ఏమన్నారో కింద వీడియోలో ఉంది చూడండి.
కేసీఆర్ సర్కార్ కు శ్యామల కన్నీటి శాపనార్థం (వీడియో)
