బ్రేకింగ్ : రేవంత్ ఫైర్.. కొడంగల్ లో టెన్షన్.. (వీడియో)

కొడంగల్ లో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్ రెడ్డి కొడంగల్ లో హరితహారం  కార్యక్రమంలో పాల్గొంటారని బ్యానర్ రాయించారు. కానీ జూపల్లి ఒక్కరే హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రుల పేర్లతోపాటు ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి పేరును బ్యానర్ మీద రాయించారు. కానీ స్థానిక ఎమ్మెల్యే అయిన రేవంత్ రెడ్డి పేరు బ్యానర్ లో లేకపోవడంతో అధికారులను నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే గా తన పేరు ఎందుకు రాయలేదని అధికారులను నిలదీశారు. ఎమ్మెల్యే పేరు రాయకుండానే బ్యానర్లు ఎలా ముద్రించారని ప్రశ్నించారు. పైగా ఎమ్మెల్యే పేరు పక్కనపెట్టి ఎమ్మెల్సీ పేరు ఎలా రాశారని నిలదీశారు. దీంతో సభలో పెద్ద దుమారం రేగింది. రేవంత్ రెడ్డి అనుచరులు, కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రేవంత్ నిలదీయడంతో దిగొచ్చిన అధికారులు బ్యానర్ ను పీకి పారేశారు. రేవంత్ అధికారులను నిలదీసే సమయంలో కార్యకర్తల నినాదాలతో సభా ప్రాంగణమంతా టెన్షన వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి రేవంత్ కార్యకర్తలను శాంతింపజేశారు. వీడియో కింద ఉంది చూడండి.