Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ ఆక్టివిటీ.. మీనాక్షి నటరాజన్ ఎంట్రీతో టెస్టింగ్ టైమ్!

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ వర్గీయ చర్చలు, విశ్లేషణల సందడి మొదలైంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ పర్యటనలో ఉన్నారు. హైదర్‌గూడలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆమె నిర్వహిస్తున్న సమీక్షలు నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. నియోజకవర్గాల వారీగా నేతలతో భేటీలు జరుపుతూ, స్థానిక రాజకీయాలు, పార్టీ బలోపేతంపై గమనించాల్సిన అంశాలను సమీక్షిస్తున్నారు.

ఈ సమావేశాల్లో ముఖ్యంగా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. బుధవారం ఆమె ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, మెదక్, జహీరాబాద్, మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అభ్యర్థులపై ప్రజా స్పందన ఎలా ఉంది? వంటి అంశాలపై ఆమె లోతుగా చర్చించారు. అలాగే ప్రభుత్వ పథకాల అమలు, సమస్యల పరిష్కారాల్లో తలెత్తిన లోపాలపై కూడా అధికారులకు నివేదిక ఇవ్వాలని సూచించారు.

ఈ సమీక్షలతో పార్టీ శ్రేణుల్లో కార్యకలాపాలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. ఇటీవల కొంతవరకే పరిమితమైన కార్యకలాపాల తరువాత మీనాక్షి నటరాజన్ సమీక్షలు పార్టీని మళ్లీ క్రమబద్ధంగా ముందుకు నడిపించనున్నాయి. జిల్లా స్థాయి నుంచి తాలూకా స్థాయికి వరకు నేతల పనితీరు గురించి పర్యవేక్షించాలని ఆమె స్పష్టం చేశారు.

రానున్న రోజుల్లో ఎమ్మెల్యేలు, పార్లమెంట్‌ టికెట్ ఆశిస్తున్నవారితో పాటు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో ప్రత్యేకంగా చర్చలు జరపనున్నట్లు సమాచారం. పార్టీని భవిష్యత్ ఎన్నికల కోసం గట్టి పునాది మీద నిలబెట్టే దిశగా ఈ సమీక్షలు ఉపయోగపడతాయని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఈ సారి కేసీఆర్ సీఎం || Auto Drivers Fires on Congress Govt || CM Revanth || Telugu Rajyam