జగన్ చెల్లిది ఇంత గొప్ప మనస్సా.. అలాంటి పనులు చేశారా?

తెలంగాణలో పొలిటికల్ హీట్ ఎక్కువయ్యింది. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రతి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే తమ కార్యాచరణను మొదలు పెడుతున్నారు. తాజాగా వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కూడా మాస్టర్ ప్లాన్ వేశారు. పాలేరు నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచేందుకు షర్మిల మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అందుకే తన సొంత డబ్బులతో ఉచిత పథకాలు అమలు చేయనున్నట్లు సమాచారం.

ఇప్పటికే పాలేరులో ఇంటి నిర్మాణాన్ని వైఎస్ షర్మిల మొదలు పెట్టారు. తాజాగా ఫ్రీ స్కీములను కూడా పాలేరులో అమలు చేసే పనిలో ఉన్నారు. మెజార్టీ ఓటర్లకు ఆరోగ్యశ్రీ కార్డు తరహాలోనే గుర్తింపు కార్డులను కూడా ఇచ్చి వారికి ఏ ఆస్పత్రిలోనైనా ఉచిత వైద్యం అందించేందుకు చూస్తున్నారు. ఖమ్మంలోనే కాకుండా అవసరమైన వారికి హైదరాబాద్​లో కూడా మంచి వైద్యం అందించేందుకు తమ పార్టీ నుంచి ఖర్చు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు నాలుగు అంబులెన్సులను సిద్ధం చేయడంతో పాటుగా పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్య అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పలు స్కూళ్లతో ఒప్పందాలు చేసుకుని ఆ ఫీజు తామే చెల్లించనున్నట్లు తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దాన్ని అమలు చేసేందుకు చూస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఉన్నత విద్య చదివే స్టూడెంట్స్​ ఎవరైనా ఆర్థిక సాయం కోరితే వారికి సాయం చేసేందుకు ప్రత్యేక ఆఫీసును కూడా పెడుతున్నట్లు సమాచారం.

పాలేరులో ఎవరైనా చనిపోతే వారి కుటుంబాలకు రూ.25 వేలు ఇస్తూ ఉన్నారు. గర్భిణికి రూ.10వేలు, అమ్మాయి పుడితే రూ.25వేల చొప్పున అందించనున్నట్లు తెలిపారు. పేదల ఇండ్లలో పెళ్లిళ్లకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామని వైఎస్ఆర్ టీపీ నాయకులు కూడా వెల్లడించారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న వైఎస్​ షర్మిల, ఈనెల 19వ తేదిన హైదరాబాద్​ తిరిగి రాగానే పాలేరులో పర్యటించి కొన్ని పథకాలను మొదలుపెట్టనున్నారు.