ర్యాలీ ప్రియాంకది, ఫోటో తెలంగాణది, పప్పులో కాలేసిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ సూపర్ స్టార్ ప్రియాంక గాంధీ వద్రా ఉత్తర ప్రదేశ్ లో జరిపిన తొలి ర్యాలి సూపర్ హిట్ అంటున్నారు. ఆ ర్యాలీకి విపరీతంగా జనం వచ్చారని చెబుతున్నారు. కిలో మీటర్ల తరబడి ప్రజలు క్యూలు కట్టారని చెబుతున్నారు. అయిత, ఈ వార్తను షేర్ చేసేందుకు కాంగ్రెస్ నేతలు వాడిన ఫోటోల్లో మాత్రం ఒకటి బోగస్. వాళ్లు తెలంగాణలో జరిగిన ఒక ర్యాలీకి వచ్చిన జనానిని సంబంధించిన ఫోటో చూసి ఆ జనం ప్రియాంక ర్యాలీకి వచ్చారని తెగ షేర్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది కూడా సోమవారం నాటి ప్రియాంక గాంధీ వాద్ర ర్యాలీ ఫోటో గా తెలంగాణ ఫోటోను షేర్ చేశారు. ఈ విషయాన్ని ఇలాంటి ఫేక్ ఫోటోలను తనిఖీ చేసే బూమ్ లైవ్.ఇన్ వెల్లడించింది.


ప్రియాంక చౌదరి ట్విట్లర్ లో ఈ ఫేక్ ఫోటో పోస్టు చేయగానే కాంగ్రెస్ కు చెందిన వారంతా ఈ తెలంగాణ ఫోటో ని లక్నో రోడ్ షో గా షేర్ చేసేశారు.

ఇదే తెలంగాణ కాంగ్రెస్ ర్యాలీ ఫోటో

కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ (తూర్ప యుపి) ఇన్ చార్జ్ ప్రియాంక గాంధీ లక్నో రోడ్ షో విజయంతమయిందనే చెప్పేందుకు షేర్ చేసిన నాలుగు ఫోటోలలో తెలంగాణ ఫోటో ఉండటం విశేషం.
ఇదే ఫోటోని, అందులో ఏముందో చూడకుండా జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవ్ చంద్ దేవ్ కడా షేర్ చేశారు.
ఒక ట్విటరీయుుడు ఈ నాలుగు ఫోటోలలో ఒకటి తేడా గా ఉందని గమనించాడు. చతుర్వేది షేర్ చేసిన ఫోటోలలో ఒక దాని తెలుగు అక్షరాలున్న బోర్డులున్నాయి. ఈ విషయాన్ని ఆయన ఎత్తి చూపాడు. లక్నోలో తెలుగు అక్షరాలున్న బోర్డులెలా వస్తాయి.

ఒక ట్విట్టరీయుడు తెలుగు బోర్డును గమనించాడు, లక్నోలో తెలుగేంటి?

అయితే, తెలంగాణ పోటో కూడా కాంగ్రెస్ కావడంతో కాంగ్రెసోళ్లు కొంత వూపిరి పీల్లుకోవచ్చు. ఈ ఫోటో తెలంగాణలో జరిగిన ఒక కాంగ్రెస్ ర్యాలీకి సంబంధించింది. దీనిని మహమ్మద్ అజారుద్దీన్ గత డిసెంబర్ షేర్ చేశారు. అందువల్లే ఈ పోటోలో తెలుగు బోర్డులున్న భవనాలు కనిపిస్తున్నాయి.

ఈ విషయం బయటపడానే, ప్రియాంక చతుర్వేది, యాదవ్ ఈ ట్వీట్లను తీసేశారు. చతుర్వేది తన తప్పును ఒప్పుకున్నారు. తర్వాత కొత్త పోటోలను ట్వీట్ చేశాుు. అవి మాత్రం ప్రియాంక గాంధీ సోమవారం జరిపిన లక్నో రోడ్ షో ఒరిజినల్ ఫోటోలే.

మహమ్మద్ అజారుద్దీన్ ట్వీట్ చేసిన ఫోటో ఇదే

తప్పు తెలుసుకున్నాక కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది తెలంగాణ ఫోటోను తీసేసి ట్వీట్ చేసిన కొత్తఫోటోలు ఇక్కడున్నాయి.