గవర్నర్ నర్సింహ్మన్ టిఆర్ఎస్ ఏజెంట్ : విహెచ్ ఫైర్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహ్మన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హన్మంతరావు. గవర్నర్ టిఆర్ఎస్ ఏజెంట్ గా మారిపోయిండని విమర్శించారు. నిత్యం తెలంగాణ సిఎం కేసిఆర్ కు భజన చేస్తున్న గవర్నర్ ను వెంటనే మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. 

గురువారం హన్మంతరావు మీడియాతో మాట్లాడారు. టిఆర్ఎస్ ఏజెంట్ గా మారి గవర్నర్ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నాడని మండిపడ్డారు. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు విహెచ్ హెచ్చరించారు. 

 

తెలంగాణలోని బిసిలంతా ఏకమై పంచాయతీ రిజర్వేషన్లలో జరుగుతున్న అన్యాయంపై నిలదీయాలని విహెచ్ పిలుపునిచచారు. టిఆర్ఎస్ సర్కారు ఆర్డినెన్స్ తీసుకొచ్చి బిసిలకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు.